Amruta Fadnavis: అమృతా ఫడణవీస్ను బ్లాక్మెయిల్ చేసి.. రూ.10కోట్లు డిమాండ్..!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య అమృతా ఫడణవీస్ను(Amruta Fadnavis) బ్లాక్మెయిల్ చేసిన డిజైనర్.. ఆమె నుంచి రూ.10కోట్లు లాగేందుకు యత్నించింది. నకిలీ వీడియోలు పంపించి అమృతను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
డిజైనర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతా (Amruta Fadnavis)కు రూ. కోటి ఇవ్వజూపిన డిజైనర్ అనిక్ష జైసింఘానీ (Aniksha Jaisinghani) కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేసేందుకు తొలుత లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన అనిక్ష.. అది కుదరకపోవడంతో అమృతా ఫడణవీస్ను బ్లాక్మెయిల్ చేసినట్లు ముంబయి పోలీసులు (Mumbai Police) వెల్లడించారు. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే అమృతకు చెందిన కొన్ని వీడియోలను వైరల్ చేస్తానని ఆ డిజైనర్ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై తాజాగా బలవంతపు వసూళ్ల (Extortion) కేసు నమోదు చేశారు.
అనిక్షపై ఇప్పటికే అమృతా ఫడణవీస్ (Amruta Fadnavis) బ్లాక్మెయిల్ (Blackmail), బెదిరింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె తన తండ్రి అనిల్ జైసింఘానీకి సంబంధించిన క్రిమినల్ కేసులను మాఫీ చేయించేందుకు రూ.కోటి ఇవ్వజూపిందని అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఇందుకు అమృత అంగీకరించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనిక్ష, ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదైన రెండు రోజుల తర్వాత ఆ డిజైనర్.. అమృతకు రెండు వీడియోలను పంపింది. ఆ వీడియోల్లో డబ్బు ఉన్న బ్యాగును అమృత (Amruta Fadnavis)కు ఇస్తున్నట్లుగా ఉంది. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోలను వైరల్ చేస్తానని ఆమె అమృతను బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వీడియోలను పరిశీలించగా.. అవి మార్ఫింగ్ చేసినవిగా తేలినట్లు పేర్కన్నారు. దీంతో ఆ డిజైనర్పై బలవంతపు వసూళ్లకు యత్నించినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోలను రూపొందించిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘బెదిరించింది.. రూ. కోటి ఇస్తానంది’: డిజైనర్పై అమృతా ఫడణవీస్ కేసు
పోలీసులపైకే శునకాలను వదిలేసి.. ఎవరీ అనిల్ జైసింఘానీ
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డిజైనర్ అనిక్ష తండ్రి అనిల్ జైసింఘానీ పేరు మోసిన అంతర్జాతీయ క్రికెట్ బుకీ అని తెలుస్తోంది. ఐపీఎల్ సమయంలో కోట్లాది రూపాయాలతో బెట్టింగ్లు నిర్వహించే అనిల్.. ఆ కేసుల్లో చిక్కకుండా ఉండేందుకు పోలీసులకు భారీగా లంచాలు ఇస్తుంటాడట. ఆ తర్వాత వాటిని వీడియోలు తీసి పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తుంటాడని తెలిసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ NCP) తరఫున అనిల్ గతంలో కార్పొరేటర్గా పనిచేశాడు. అతడి వద్ద ఖరీదైన పెంపుడు శునకాలు ఉన్నాయి. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడి ఇంటికి వెళ్తే.. వారిపైకి శునకాలను వదిలి భయపెట్టేవాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నారు. రాజకీయ నేతల అండతో బెట్టింగ్లకు పాల్పడుతున్న అనిల్పై ఇప్పటికే 15 వరకు కేసులున్నాయి. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా అతడు పరారీలో ఉన్నాడు.
కాగా.. అమృతా ఫడణవీస్ (Amruta Fadnavis)పై బెదిరింపులకు పాల్పడిన కేసులో గత గురువారం అనిక్షను అరెస్టు చేశారు. నిన్న ఆమెను కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో న్యాయస్థానం ఆమెకు మార్చి 21 వరకు పోలీసు కస్టడీ విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం