భారత్లో 3 ‘కొవిడ్’ కేసులు: కేంద్రం
చైనాలో విజృంభిస్తున్న ప్రాణాంతక కొవిడ్ -19 (కరోనా వైరస్) ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న నేపథ్యంలో భారత్లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశంలో ముగ్గురికే కొవిడ్ -19 లక్షణాలు ఉన్నట్టు తేలిందని.......
దిల్లీ: చైనాలో విజృంభిస్తున్న ప్రాణాంతక కొవిడ్ -19 (కరోనా వైరస్) ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న నేపథ్యంలో భారత్లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశంలో ముగ్గురికే కొవిడ్ -19 లక్షణాలు ఉన్నట్టు తేలిందని స్పష్టం చేసింది. ఆ మూడు కేసులూ కేరళలోనే నమోదైనట్టు వెల్లడించింది. కొవిడ్పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గురువారం దిల్లీలో సమావేశమై దేశంలో నెలకొన్న పరిస్థితితో పాటు సన్నద్ధతపై సమీక్షించింది. అనంతరం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు మొత్తం 15,991 మందిని పరిశీలించినట్టు చెప్పారు. వారిలో 1671 మంది రక్త నమూనాలను వైద్యులు పరీక్షలకు పంపారని వివరించారు. వుహాన్ నుంచి వచ్చిన 645 మందిని వైద్య శిబిరాల్లో పరిశీలనలో ఉంచారని తెలిపారు. చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి చెప్పారు.
ఇప్పటివరకు దేశంలోని 21 విమానాశ్రయాల్లో 2,51,447 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు మంత్రి వివరించారు. అంతర్జాతీయ భారీ నౌకాశ్రయాలు, నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కొవిడ్పై పరిశోధనలు నిర్వహించే బాధ్యత పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు. దేశంలోని అన్ని మంత్రిత్వశాఖలూ సమన్వయంతో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 28 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయని హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశామని, కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జపాన్లోని డైమండ్ ప్రిన్సెస్ నౌకలో భారతదేశానికి చెందిన ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలిందని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ పరిశీలిస్తోందని తెలిపారు. విదేశాంగ శాఖ ద్వారా చైనాకు కొన్ని వైద్య పరికరాలు, ఇతర సామగ్రి పంపిస్తున్నట్టు మంత్రి వివరించారు.
రాహుల్ చాలా సీనియర్ నాయకుడు..
చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొవిడ్-19పై కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన ట్వీట్పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘రాహుల్ చాలా సీనియర్ నాయకుడు. ఓ ముఖ్య నేత కుమారుడు..’ అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై తాను విమర్శలు చేయాలనుకోవడంలేదన్నారు. చైనాలో కొవిడ్ విజృంభిస్తుండటంతో దేశ ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు ముప్పు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలేదంటూ నిన్న రాహుల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే