Earthquake: భూకంపాలను ముందే గుర్తించవచ్చా?
భూకంపాలను ముందే గుర్తించవచ్చా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానమిస్తున్నారు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ)లోని భూకంపాల అధ్యయన కేంద్రం శాస్త్రవేత్తలు.
సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు
కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో మరింత కచ్చితత్వం
‘ఈనాడు’తో ఎన్జీఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు
భూకంపాలను ముందే గుర్తించవచ్చా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానమిస్తున్నారు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ)లోని భూకంపాల అధ్యయన కేంద్రం శాస్త్రవేత్తలు. భూమి లోపల నీటిమట్టంపై ఒత్తిడి, వాతారణంలోని ఐనోస్పియర్లో మార్పులు, భూకంపాలకు ముందు వచ్చే చిన్నచిన్న ప్రకంపనలు, భూమి పగుళ్లలోంచి వచ్చే రెడాన్ వాయువులను అధ్యయనం చేయడం ద్వారా భూకంపాలను ముందే గుర్తించవచ్చని చెబుతున్నారు. అయితే ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నామని, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని కంప్యూటరీకరించి కృత్రిమమేధ, మెషిన్లెర్నింగ్ సాంకేతికను జోడిస్తే కచ్చితత్వం వస్తుందని ఎన్జీఆర్ఐ భూకంప అధ్యయన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు అన్నారు. ఎన్జీఆర్ఐ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో చర్చలు, కార్యశాలలు జరుగుతున్నాయి. భూకంపాలపై జరిగిన సరికొత్త పరిశోధనలు, ప్రకంపనలను ముందే గుర్తించే విధానాలపై జరిగిన చర్చల సారాంశాన్ని ఆయన ‘ఈనాడు’కు వివరించారు.
నీటిమట్టంలో తేడాలు ఇలా
భూకంపం రావడానికి ముందు భూమి లోపలి పొరల్లోని నీటిమట్టంలో పెను మార్పులు సంభవిస్తాయి. ప్రకంపనాల తాకిడికి నీటి వనరులు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ ప్రాంతంలో బోర్లు ఉన్న పక్షంలో అందులోంచి ఒక్కసారిగా నీరు పైకి ఉబికి వస్తుంది. భూమిలోపల ఏదో జరుగుతుందనేందుకు ఇదో సంకేతం. ఈ తరహా అధ్యయనాన్ని ఎన్జీఆర్ఐ మహారాష్ట్రలోని కోయ్నా ప్రాంతంలో చేపట్టింది. అక్కడికి 20 కి.మీ. పరిధిలో ఉన్న బోర్వెల్స్కు పరికరాలు అమర్చి శాటిలైట్, ఇంటర్నెట్ సాయంతో పర్యవేక్షించింది. బోర్ల నుంచి ఉబికి వచ్చిన నీరు ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశం ఉందని ముందే హెచ్చరించింది. ఆ తర్వాత అక్కడ భూ ప్రకంపనలు వచ్చాయి.
రెడాన్ గ్యాస్వాయువులు..
భూకంపాలకు ముందు భూమి లోపల ఏర్పడే ఒత్తిడికి పగుళ్లు ఏర్పడుతాయి. ఇందులోంచి రెడాన్ వాయువులు బయటికి వస్తాయి. వాటిని గుర్తించే పరికరాలను ఎన్జీఆర్ఐ వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసి నమోదు చేస్తుంది. వీటిని విశ్లేషించడం ద్వారా భూకంపం ముందే వచ్చే అవకాశాలను అంచనా వేస్తుంది.
ఐనోస్పియర్లో ఛార్జ్లో తేడాలు..
వాతావరణంలో ఉండే పొరల్లో మార్పుల్ని గమనించడం ద్వారా కూడా భూకంపాలను అంచనా వేయవచ్చు. ఐనోస్పియర్లో విద్యుదయస్కాంత తరంగ శక్తి ఉంటుంది. ప్రకంపనలు సంభవించినప్పుడు తరంగాల శక్తిలో మార్పులు సంభవిస్తాయి. భూకంపం వచ్చే ప్రాంతాల్లో ఈ తేడాలను గతంలో ఎన్జీఆర్ఐ రికార్డు చేసింది. ఈ మార్పులను గుర్తించేలోపే భూకంపాలు వచ్చేస్తుండటంతో ఇది పెద్దగా ప్రయోజనం ఇవ్వడం లేదు. అప్రమత్తం చేసేందుకు గంట కూడా సమయం ఉండడం లేదు. అందుకే దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నాం.
చిన్న ప్రకంపనలతో మొదలై..
భూకంపాలు ఏర్పడటానికి ముందు భూమిలో చిన్నచిన్న ప్రకంపనలు ఏర్పడతాయి. వీటినే ఫోర్షాక్స్ క్లస్టర్స్ అంటారు. గుంపుగా, తక్కువ సమయంలో అవి వచ్చిపోతుంటాయి. వీటిని పర్యవేక్షించడం ద్వారా భారీ భూకంపాలను ముందే పసిగట్టవచ్చు.
కృత్రిమ మేధ తోడైతే
భూకంపాల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది. వీటిని కంప్యూటరీకరించి కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ సాయంతో పర్యవేక్షణకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి భూకంప లేఖినులు, ఇతరత్రా పరికరాల అమర్చగలిగితే కచ్చితమైన సమాచారం రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ విధానంలో ఆరంభ దశలో ఉన్నాం. మరింత పరిశోధనలు జరగాల్సి ఉంది.
లాక్డౌన్తో అధ్యయనానికి అనువుగా..
భూకంపాల అధ్యయనానికి లాక్డౌన్ కాలం బాగా ఉపయోగపడింది. సాధారణ రోజుల్లో ట్రాఫిక్, పరిశ్రమల శబ్దాలతో భూకంప లేఖినిలో సంకేతాలను వేరు చేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చేది. శబ్దాన్ని వడగట్టేందుకు వాడే ఫిల్టర్ల విశ్లేషణలోనూ కొన్నిసార్లు స్పష్టత ఉండేది కాదు. లాక్డౌన్తో శబ్దాలు స్పష్టంగా నమోదవుతున్నారు.-ఈనాడు, హైదరాబాద్-
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
UPSC IFS final Result| ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించిన మెయిన్ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. -
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
విధి తల్లిదండ్రులను దూరం చేసినా ఆ బాలుడు అధైర్య పడలేదు. పదేళ్ల పసిప్రాయంలో కష్టాలను దిగమింగుతూ జీవితంలో ముందడుగు వేశాడు. అతడికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవ్వడంతో ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సహాయం చేస్తామని పలువురు ముందుకువస్తున్నారు. -
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
Arvind Kejriwal: మద్యం కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. -
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారం(Prajwal Revanna sex abuse case) కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. -
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు