మతమార్పిడి నిరోధక చట్టాలపై కేసుల స్థితిని తెలపండి
వివాహాలను అడ్డుపెట్టుకుని జరుగుతున్న మత మార్పిళ్లను నిరోధించడానికి వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టుల్లో దాఖలైన కేసుల స్థితిని తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం
దిల్లీ: వివాహాలను అడ్డుపెట్టుకుని జరుగుతున్న మత మార్పిళ్లను నిరోధించడానికి వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టుల్లో దాఖలైన కేసుల స్థితిని తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు స్వచ్ఛంద సంస్థ.. ‘సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’కు ఈ మేరకు సూచనలు చేసింది. ‘రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టం, ఆర్డినెన్స్ లేదా చట్ట సవరణలకు వ్యతిరేకంగా హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సారాంశాన్ని తెలియజేస్తూ ఒక నోట్ అందజేయండి. అవన్నీ స్వభావ రీత్యా ఒకే తరహా కేసులైతే సుప్రీంకోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలిస్తాం. ఒకవేళ హైకోర్టుల్లో విచారణ కీలక దశలో ఉంటే అక్కడే కొనసాగించాలని చెబుతామ’ని ధర్మాసనం పేర్కొంది. నోట్ దాఖలుకు రెండు వారాల గడువునిచ్చింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మత స్వేచ్ఛ చట్టం-2003’లోని సెక్షన్ 5 అమలు నిలిపివేతకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కూడా కేసు దాఖలైంది. ఆ వివరాలనూ తమకు అందజేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం కోరింది. ఆ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం... వివాహితులు మతం మారాలని భావిస్తే జిల్లా మేజిస్ట్రేట్ అనుమతిని పొందాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాలు తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు స్వభావ రీత్యా ఒకే రకమైనవని, ఆయా హైకోర్టుల్లో దాఖలైన కేసులన్నిటినీ సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీచేయడం సముచితమని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. హైకోర్టుల్లో కేసుల విచారణలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వెల్లడించారు.
విదేశాలకెళ్లే భారతీయులకు ప్రామాణిక నిబంధనలు రూపొందించాలన్న పిటిషన్ తిరస్కరణ
ఇతర దేశాలకు వెళ్లే భారతీయుల భద్రత కోసం ప్రామాణిక నిబంధనలు రూపొందించి జారీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. యూఏఈలో అక్రమ నిర్బంధానికి గురై నాలుగు రోజుల తర్వాత విడుదలైన నొయిడా వ్యాపారి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అతని ముఖం ఆకృతి.. పరారీలో ఉన్న నేరస్థుడి ముఖ పోలికలకు సామీప్యం ఉన్నట్లు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ గుర్తించడంతో ఆ వ్యాపారికి కష్టాలు ఎదురయ్యాయి. విదేశాల్లో అక్రమ నిర్బంధానికి గురైతే ఆ అంశాన్ని పరిశీలించి పరిష్కరించడానికి దౌత్య కార్యాలయాలు ఉన్నాయని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది. -
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ