ఆరు నెలల్లో హైస్పీడ్‌ రైలు

వచ్చే ఆరు నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్‌ రైలు అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

Published : 24 Sep 2023 05:36 IST

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

సనంద్‌: వచ్చే ఆరు నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్‌ రైలు అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌- సనంద్‌ మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. సనంద్‌లో జరిగిన సెమీకండక్టర్‌ కంపెనీ మైక్రాన్‌ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో సెమీ కండక్టర్ల డిమాండ్‌ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందన్నారు. ఈ రంగంలో గుజరాత్‌ ముందువరుసలో నిలిచిందన్నారు. సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేస్తామని మైక్రాన్‌ సంస్థ ఈ జూన్‌లో ప్రకటించింది. ఇందుకోసం ఈ అమెరికన్‌ కంపెనీ రూ.22,140 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని