LPG subsidy: ఎల్పీజీ రాయితీ పొడిగింపు.. మరో ఏడాది పాటు రూ.300 తగ్గింపు
Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్వల లబ్ధిదారులకు ఇస్తున్న సిలిండర్పై ఇస్తున్న రాయితీ గడువును మరో ఏడాది పొడిగించింది.
LPG subsidy | దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ ఉజ్వల లబ్ధిదారులకు గుడ్న్యూస్ చెప్పింది. వారికి వంట గ్యాస్ సిలిండర్పై ఇస్తున్న రాయితీ (LPG subsidy) గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్పై ప్రస్తుతం రూ.300 సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికీ ఈ రాయితీని వర్తింపజేసింది. ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగియనున్న వేళ మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై రూ.12వేల కోట్ల భారం పడనుందని చెప్పారు.
2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తారు. సిలిండర్ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంఉటంది. 2022లో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్పై రూ.200 సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. గతేడాది అక్టోబర్లో సబ్సిడీ మొత్తాన్ని రూ.300కు పెంచింది. ప్రస్తుతం దిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.903గా ఉంది. ఆ లెక్కన వీరికి రూ.603కే లభిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో గతేడాది ఆగస్టులో రూ.200 చొప్పున గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడంతో అటు ఉజ్వల లబ్ధిదారులతో పాటు ఇతర గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు సగటున ఏడాదికి 3.68 రీఫిల్స్ వినియోగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై దాడి ఘటన నేపథ్యంలో.. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. -
కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు
లోక్సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. -
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
కోల్కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, భాజపా లోక్సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. -
జస్టిస్ బోపన్నకు ఘనంగా వీడ్కోలు
పదవీ విరమణ పొందుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.బోపన్నకు సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయం, సమయపాలన, ఔదార్యానికి ఆయన మారుపేరు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఈ సందర్భంగా కొనియాడారు. -
క్రిమిసంహారాల అతి వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
ఆహారోత్పత్తులపై క్రిమిసంహారాలను, రసాయనాలను అధికంగా వినియోస్తున్నందున దేశంలో మరణాల సంఖ్య పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. -
బీబీసీ డాక్యుమెంటరీపై విచారణ నుంచి వైదొలగిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీకి సంబంధించి ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జయరామ్ భంభానీ వైదొలిగారు. -
ఎయిరిండియా విమానానికి ప్రమాదం
ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురికావడంతో సర్వీసును రద్దు చేశారు. పుణె నుంచి 200 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం దిల్లీకి బయలుదేరేందుకు ఆ విమానం రన్వే పైకి వచ్చింది. -
వాయవ్య భారతంలో వడగాల్పులు
విపరీత ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో వాయవ్య భారతం అల్లాడుతోంది. దిల్లీలోని నజఫ్గఢ్లో శుక్రవారం నమోదైన 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతే దేశంలో ఇప్పటివరకు అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. -
పెరుగుతున్న జీవక్రియ వ్యాధులు
మధుమేహం, అధిక రక్తపోటు, నడుం చుట్టూ కొవ్వు పెరగడం వంటి జీవక్రియ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని లాన్సెట్ వైద్య విజ్ఞాన పత్రికలో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం హెచ్చరించింది. -
వైవాహిక అత్యాచారాలకు మినహాయింపుపై పిటిషన్
వైవాహిక అత్యాచారాలను నూతన క్రిమినల్ చట్టాల (భారత న్యాయ సంహిత) నుంచి మినహాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
ఏసీ యూనిట్లో మంటలు చెలరేగడంతో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన దిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. -
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను వెల్లడించడంపై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు సూచించింది.