Manipur : మణిపుర్ విద్యార్థులారా ఉన్నత విద్య పూర్తి చేయాలనుకుంటే కేరళ వచ్చేయండి!
మణిపుర్ (Manipur) విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన కన్నూర్ యూనివర్సీటీ ముందుకొచ్చింది. ఆసక్తి గల విద్యార్థులు తమను సంప్రదించవచ్చని ఆ విశ్వ విద్యాలయ ఉప కులపతి పేర్కొన్నారు.
తిరువనంతపురం : మణిపుర్ (Manipur) రాష్ట్రంలో ఘర్షణలతో విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎంతో మంది విద్యకు దూరమైపోయారు. ఈ నేపథ్యంలో కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన కన్నూర్ యూనివర్సీటీ మణిపుర్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. అండర్ గ్రాడుయేట్, పోస్ట్ గ్రాడుయేట్ చదవాలనే ఆకాంక్షతో ఉన్న మణిపుర్ విద్యార్థులు తమను సంప్రదించాలని విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ తెలిపారు. మణిపుర్ విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ అంశంపై యూనివర్సిటీ సిబ్బందితో చర్చించిన తరువాత ఏకాభిప్రాయానికి వచ్చామని ఆయన వెల్లడించారు.
అవిశ్వాసంపై చర్చకు సిద్ధం.. రాహుల్ గాంధీతోనే మొదలు..?
విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో వారికి ప్రవేశం కల్పిస్తామని వీసీ పేర్కొన్నారు. ‘మణిపుర్లో విధ్వంసం జరుగుతున్న కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న వారికి యూనివర్సీటీ ప్రత్యేక సీట్లను కేటాయిస్తుంది. వివిధ ప్రోగ్రామ్లలో చేరిన వారికి సైతం వసతి కల్పిస్తాం. ప్రవేశం పొందిన విద్యార్థులు వారి విద్యార్హత పత్రాలను సమర్పించడానికి తగినంత సమయం ఇస్తాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రవేశం పొందడానికి మణిపుర్ విద్యార్థి ఒకరు ఆసక్తి కనబర్చారని’ వీసీ వివరించారు.
మణిపుర్ విద్యార్థులు తమకు ప్రవేశాలు కల్పించాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను ఇది వరకే సంప్రదించారని కన్నూర్ యూనివర్సీటీ ఉప కులపతి డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ తెలిపారు. గత నెలలో మణిపుర్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ చర్య తరువాతే మణిపుర్ విద్యార్థులు తనతో సంప్రదింపులు చేయడానికి ముందుకు వచ్చారని వీసీ వివరించారు. ఇలాంటి మంచి పనులతో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. -
హేమంత్కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. -
పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఈవీఎం ఎన్క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్పై త్రయంబకేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పుడమి గర్భాన ‘బొగ్గు’మన్న మంటలు!
ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని ఖలారీ రేంజ్లో బొగ్గు గని నుంచి సోమవారం ఎగసిపడుతున్న అగ్నికీలలివి. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
దురుసు డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ కింద విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. -
చదవాల్సిన పుస్తకం!
మీకు విద్యారంగంపైన ఇష్టం ఉంటే మీరు ఈ పుస్తకం కచ్చితంగా చదవాల్సిందే. -
సుశీల్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇంటికి వెళ్లారు. -
‘ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణం తగ్గించొద్దు’
వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఆప్నకు విదేశీ నిధులు అందాయి
ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. -
విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) ఛాన్స్లర్ జి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. -
దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ రాతలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది. -
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.