LS Polls: ‘సార్వత్రిక’ విజయం.. అందనంత దూరం.. 99% స్వతంత్రుల డిపాజిట్లు గల్లంతు
లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్ల మద్దతు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 1951లో ఆరు శాతం, 1957లో ఎనిమిది శాతంగా ఉన్న వారి విజయాలు.. 2019 నాటికి 0.11 శాతానికి పడిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections)కు భారత్ సిద్ధమైంది. ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే.. దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే స్వతంత్ర అభ్యర్థుల (Independent Candidates)కు ఓటర్ల మద్దతు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్రులుగా పోటీ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. 1951లో ఆరు శాతం, 1957లో ఎనిమిది శాతంగా ఉన్న వారి విజయాలు.. 2019 నాటికి 0.11 శాతానికి పడిపోయాయి. 1991 ఎన్నికల నాటి నుంచి ఏకంగా 99 శాతానికిపైగా ఇండిపెండెంట్లు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.
సొంతవాళ్లే ఓటెయ్యలేదు.. ఒక్క ఓటుతో ఓడిపోయారు..!
- 1951-52 తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 533 మంది స్వతంత్రులు పోటీ పడ్డారు. అయితే.. వారిలో కేవలం 37 మంది మాత్రమే విజయం సాధించారు. 1957లో 1519 మంది బరిలో దిగగా.. 42 మంది మాత్రమే గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లోనూ 67 శాతం మంది ఇండిపెండెంట్లు తమ డిపాజిట్ కోల్పోయారు.
- 1962లో స్వతంత్రుల్లో 20 మంది (4.2 శాతం) గెలుపొందారు. 78 శాతానికి పైగా పోటీదారుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం నిర్వహించిన 1984 ఎన్నికల్లో 13 మంది (0.30 శాతం మంది) విజయం సాధించగా.. 96 శాతానికిపైగా ఇండిపెండెంట్లకు ధరావత్తు దక్కలేదు.
2019లో నలుగురే..
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది వేలమందికి పైగా స్వతంత్రులు పోటీ చేయగా.. కేవలం నలుగురు మాత్రమే గెలుపుతీరాలకు చేరారు. 99.6 శాతం మంది డిపాజిట్ కోల్పోయారు. గెలిచిన నలుగురిలో సుమలత అంబరీష్ (మండ్య, కర్ణాటక), నవనీత్ రాణా (అమరావతి, మహారాష్ట్ర), నభకుమార్ సరానియా (కోక్రాఝార్, అస్సాం), మోహన్భాయ్ డేల్కర్ (దాద్రానగర్ హవేలీ) ఉన్నారు. 2021లో డేల్కర్ మృతి చెందగా.. ఆయన సతీమణి ప్రస్తుతం శివసేన (యూబీటీ) నుంచి ఎంపీగా ఉన్నారు.
ఎందుకీ పరిస్థితి...?
ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల గెలుపు ధోరణిని పరిశీలిస్తే వారిపై ఓటర్లు విశ్వాసం చూపడం లేదని తెలుస్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు కొన్నిసార్లు పార్టీల నుంచి టికెట్ ఆశించి, భంగపడిన వారు ఉంటారు. ఓట్లను చీల్చేందుకూ పోటీ చేస్తుంటారు. ఒకవేళ గెలిస్తే బేరసారాలు చేయొచ్చన్న ఆశతో మరికొందరు ప్రయత్నిస్తారు. అయితే.. హామీలు నెరవేర్చడం పార్టీలతోనే సాధ్యమని ఓటర్లు భావిస్తున్నారు’’ అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అధిపతి మేజర్ జనరల్ అనిల్ వర్మ (రిటైర్డ్) తెలిపారు. అభ్యర్థుల విషయంలో ఓటర్లలో అవగాహన మరింత పెరిగిందని, తమ వాగ్దానాలను నెరవేర్చగలవారు ఎవరో గుర్తించగలుగుతున్నారని ‘యాక్సిస్ ఇండియా’ సంస్థ ఛైర్మన్ ప్రదీప్ గుప్తా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
భాజపా తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటి కంగనా రనౌత్.. ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ను వీడుతారా అనే ప్రశ్నకు బదులిచ్చారు. -
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
ఆప్ నేత స్వాతి మాలీవాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. -
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. -
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!