Yediyurappa: యడియూరప్పపై పోక్సో కేసు.. సీఐడీకి అప్పగింత

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (Yediyurappa)పై నమోదైన పోక్సో కేసు సీఐడీకి బదిలీ అయింది. 

Published : 15 Mar 2024 18:48 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప (81) (Yediyurappa)పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఆయనపై నమోదైన పోక్సో (POCSO) కేసును తుదుపరి దర్యాప్తు నిమిత్తం క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ (CID)కు బదిలీ చేశారు. బెంగళూరు పోలీసులకు డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అలోక్‌మోహన్‌ ఈమేరకు సమాచారం అందించారు.  

తనపై వచ్చిన ఆరోపణలను యడియూరప్ప ఖండించారు. ‘‘ఆ బాలిక, ఆమె తల్లి కొద్దిరోజుల క్రితం నన్ను కలిసేందుకు వచ్చారు. మోసం కేసులో సాయం చేయమని కోరారు. దాని గురించి బాలికతో మాట్లాడుతుంటే ఆమె ఏదీ సరిగా చెప్పలేదు. అప్పుడే ఆమె మానసిక స్థితిపై నాకు అనుమానం వచ్చింది. అయినా సరే పోలీసులను పిలిపించి వారికి అవసరమైన సాయం చేయమని చెప్పా. ఆర్థికంగా ఉపయోగపడుతుందని కొంత డబ్బు కూడా ఇచ్చా. ఇప్పుడు తిరిగి వాళ్లు నాపైనే ఫిర్యాదు చేశారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు’’ అని వెల్లడించారు.

బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై పోక్సో కేసు నమోదు

ఎన్నికల ముందు ఈ కేసు నమోదవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని