MS Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతిపట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
దిల్లీ: భారత హరితవిప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్(98)(MS Swaminathan) మృతి పట్ల యావత్ దేశం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అధికార, విపక్ష నేతలతో పాటు పలువురు దేశానికి ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకొంటున్నారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాలు తెలుపుతూ ఎక్స్ (ట్విటర్)లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
అంతులేని ఆవేదనకు గురిచేసింది.. రాష్ట్రపతి
అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరణంతో అంతులేని విషాదానికి గురయ్యానని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆహార భద్రత కోసం విశేష కృషిచేసిన దార్శనికుడు అని కొనియాడారు. ఆహార ధాన్యాలలో మన దేశానికి స్వావలంబనను చేకూర్చిన హరిత విప్లవ పితామహుడిగా పేరు గడించారని గుర్తు చేసుకున్నారు. ఇండియన్ అగ్రికల్చరల్ సైన్స్ వారసత్వాన్ని వదలి వెళ్లారని.. ఇది మానవాళికి సురక్షితమైన, ఆకలిలేని భవిష్యత్తు వైపు ప్రపంచాన్ని నడిపించేందుకు మార్గదర్శక కాంతి పుంజంగా ఉపయోగపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
సంక్లిష్ట సమయంలో అద్భుతం చేశారు.. మోదీ
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరణం తీవ్ర బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ చరిత్రలో చాలా సంక్లిష్టమైన సమయంలో వ్యవసాయ రంగంలో ఆయన చేసిన అద్భుతమైన కృషి కోట్లాదిమంది ప్రజల జీవితాలను మార్చేసిందని గుర్తు చేశారు. తద్వారా దేశ ఆహారభద్రతకు భరోసా కల్పించారన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కృషితో పాటు ఆవిష్కరణలకు ఆయనను ఓ పవర్ హౌస్గా పేర్కొన్నారు. పరిశోధనలు, మార్గనిర్దేశంలో ఆయనకు ఉన్న తిరుగులేని నిబద్ధత అసంఖ్యాక శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలపై చెరగని ముద్ర వేసిందన్నారు. డాక్టర్ స్వామినాథన్తో సంభాషణలను తాను ఎల్లప్పుడూ మనసులోనే ఉంచుకుంటానని తెలిపారు. స్వామినాథన్ జీవితం, ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎప్పటికీ గుర్తుండిపోతారు: రాహుల్
ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తంచేశారు. మన దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు స్వామినాథన్ నిబద్ధత, ఆయన చేసిన కృషి ఈరోజు మనల్ని ఆహార ధాన్యాల మిగులు దేశంగా మార్చిందని కొనియాడారు. హరిత విప్లవ పితామహుడిగా ఆయన వారసత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ కష్ట సమయంలో ఆయనను అభిమానించే వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది..: కేసీఆర్
ఎంఎస్ స్వామినాథన్ మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్దదిక్కును కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆహారాభివృద్ధిలో మనం స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన కృషే కారణమన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన పరిశోధనలు, సిఫారసులు విప్లవాత్మక మార్పులకు నాందిపలికాయని సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రతి రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత స్వామినాథన్ ఇక్కడికి రావడం, ఆయనతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో వ్యవసాయాభివృద్ధిని తెలుసుకొని ఎంతో ఆనందపడ్డారని.. వీలు చూసుకొని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేశారు: జగన్
వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను సమూలంగా మార్చిన గొప్ప వ్యక్తి స్వామినాథన్ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆయన చేసిన కృషి మర్చిపోలేనిదని.. వ్యవసాయ రంగం, దేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చేశారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
రైతు లోకానికి తీరని లోటు: నారా లోకేశ్
ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఆ మహనీయుడి మరణం యావత్ రైతు లోకానికి తీరని లోటు అన్నారు. నిరంతరం రైతాంగ సంక్షేమం కోసమే పరితపించారంటూ కొనియాడారు.
వ్యవసాయ రంగానికి తీరని లోటు: పవన్
దేశంలో హరితవిప్లవానికి ఆద్యులైన ఎంఎస్ స్వామినాథన్ మరణవార్త తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పెరుగుతున్న దేశ జనాభా అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను సమకూర్చేందుకు అవసరమైన వంగడాలను తీసుకురావడంలో ఆయన చేసిన కృషిని దేశ రైతాంగం, వ్యవసాయ రంగ నిపుణులు ఎప్పటికీ మరిచిపోరన్నారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా అనేక పరిశోధనలు చేయడం ద్వారా దేశ అభ్యున్నతి కోసం ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడారు. ఆయన మరణం దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటన్నారు.
రైతులకు MSP సిఫారసు చేసింది ఆయనే.. సీపీఎం
ఎంఎస్ స్వామినాథన్ మృతిపట్ల సీపీఎం పొలిట్బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దేశానికి ఆయన చేసిన అపార సేవలను కొనియాడింది. 1960లలో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ప్రచారం చేయడంలో ఆయన కృషిని గుర్తింపుగా వరల్డ్ ఫుడ్ప్రైజ్ను అందుకొన్న తొలి వ్యక్తి ఆయనేనని గుర్తు చేసింది. 1988లో స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ను ఏర్పాటు చేశారని పేర్కొంది. రైతుల జాతీయ కమిషన్కు ఛైర్మన్గా ఉన్న సమయంలో రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించాలని సిఫారసు చేశారని.. ఉత్పత్తి వ్యయంపై 50శాతం ధర నిర్ణయించాలని సూచించారని గుర్తు చేసింది. రైతుల పోరాటాల్లో ఈ అంశం ఇప్పటికే ఓ ప్రధాన డిమాండ్గానే ఉందన్న అంశాన్ని గుర్తు చేసింది. ఆ మహనీయుడి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢసానుభూతి తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్