MS Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతిపట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
దిల్లీ: భారత హరితవిప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్(98)(MS Swaminathan) మృతి పట్ల యావత్ దేశం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అధికార, విపక్ష నేతలతో పాటు పలువురు దేశానికి ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకొంటున్నారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాలు తెలుపుతూ ఎక్స్ (ట్విటర్)లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
అంతులేని ఆవేదనకు గురిచేసింది.. రాష్ట్రపతి
అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరణంతో అంతులేని విషాదానికి గురయ్యానని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆహార భద్రత కోసం విశేష కృషిచేసిన దార్శనికుడు అని కొనియాడారు. ఆహార ధాన్యాలలో మన దేశానికి స్వావలంబనను చేకూర్చిన హరిత విప్లవ పితామహుడిగా పేరు గడించారని గుర్తు చేసుకున్నారు. ఇండియన్ అగ్రికల్చరల్ సైన్స్ వారసత్వాన్ని వదలి వెళ్లారని.. ఇది మానవాళికి సురక్షితమైన, ఆకలిలేని భవిష్యత్తు వైపు ప్రపంచాన్ని నడిపించేందుకు మార్గదర్శక కాంతి పుంజంగా ఉపయోగపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
సంక్లిష్ట సమయంలో అద్భుతం చేశారు.. మోదీ
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరణం తీవ్ర బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ చరిత్రలో చాలా సంక్లిష్టమైన సమయంలో వ్యవసాయ రంగంలో ఆయన చేసిన అద్భుతమైన కృషి కోట్లాదిమంది ప్రజల జీవితాలను మార్చేసిందని గుర్తు చేశారు. తద్వారా దేశ ఆహారభద్రతకు భరోసా కల్పించారన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కృషితో పాటు ఆవిష్కరణలకు ఆయనను ఓ పవర్ హౌస్గా పేర్కొన్నారు. పరిశోధనలు, మార్గనిర్దేశంలో ఆయనకు ఉన్న తిరుగులేని నిబద్ధత అసంఖ్యాక శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలపై చెరగని ముద్ర వేసిందన్నారు. డాక్టర్ స్వామినాథన్తో సంభాషణలను తాను ఎల్లప్పుడూ మనసులోనే ఉంచుకుంటానని తెలిపారు. స్వామినాథన్ జీవితం, ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎప్పటికీ గుర్తుండిపోతారు: రాహుల్
ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తంచేశారు. మన దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు స్వామినాథన్ నిబద్ధత, ఆయన చేసిన కృషి ఈరోజు మనల్ని ఆహార ధాన్యాల మిగులు దేశంగా మార్చిందని కొనియాడారు. హరిత విప్లవ పితామహుడిగా ఆయన వారసత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ కష్ట సమయంలో ఆయనను అభిమానించే వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది..: కేసీఆర్
ఎంఎస్ స్వామినాథన్ మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్దదిక్కును కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆహారాభివృద్ధిలో మనం స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన కృషే కారణమన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన పరిశోధనలు, సిఫారసులు విప్లవాత్మక మార్పులకు నాందిపలికాయని సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రతి రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత స్వామినాథన్ ఇక్కడికి రావడం, ఆయనతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో వ్యవసాయాభివృద్ధిని తెలుసుకొని ఎంతో ఆనందపడ్డారని.. వీలు చూసుకొని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేశారు: జగన్
వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను సమూలంగా మార్చిన గొప్ప వ్యక్తి స్వామినాథన్ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆయన చేసిన కృషి మర్చిపోలేనిదని.. వ్యవసాయ రంగం, దేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చేశారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
రైతు లోకానికి తీరని లోటు: నారా లోకేశ్
ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఆ మహనీయుడి మరణం యావత్ రైతు లోకానికి తీరని లోటు అన్నారు. నిరంతరం రైతాంగ సంక్షేమం కోసమే పరితపించారంటూ కొనియాడారు.
వ్యవసాయ రంగానికి తీరని లోటు: పవన్
దేశంలో హరితవిప్లవానికి ఆద్యులైన ఎంఎస్ స్వామినాథన్ మరణవార్త తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పెరుగుతున్న దేశ జనాభా అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను సమకూర్చేందుకు అవసరమైన వంగడాలను తీసుకురావడంలో ఆయన చేసిన కృషిని దేశ రైతాంగం, వ్యవసాయ రంగ నిపుణులు ఎప్పటికీ మరిచిపోరన్నారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా అనేక పరిశోధనలు చేయడం ద్వారా దేశ అభ్యున్నతి కోసం ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడారు. ఆయన మరణం దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటన్నారు.
రైతులకు MSP సిఫారసు చేసింది ఆయనే.. సీపీఎం
ఎంఎస్ స్వామినాథన్ మృతిపట్ల సీపీఎం పొలిట్బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దేశానికి ఆయన చేసిన అపార సేవలను కొనియాడింది. 1960లలో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ప్రచారం చేయడంలో ఆయన కృషిని గుర్తింపుగా వరల్డ్ ఫుడ్ప్రైజ్ను అందుకొన్న తొలి వ్యక్తి ఆయనేనని గుర్తు చేసింది. 1988లో స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ను ఏర్పాటు చేశారని పేర్కొంది. రైతుల జాతీయ కమిషన్కు ఛైర్మన్గా ఉన్న సమయంలో రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించాలని సిఫారసు చేశారని.. ఉత్పత్తి వ్యయంపై 50శాతం ధర నిర్ణయించాలని సూచించారని గుర్తు చేసింది. రైతుల పోరాటాల్లో ఈ అంశం ఇప్పటికే ఓ ప్రధాన డిమాండ్గానే ఉందన్న అంశాన్ని గుర్తు చేసింది. ఆ మహనీయుడి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢసానుభూతి తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. -
బీరువాల నిండా నోట్ల కట్టలే
ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్కం ట్యాక్స్ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారీ
పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థ తన వంతు ప్రయత్నం చేస్తోంది. -
సత్పుడా పులుల అభయారణ్యంలో 10 వేల ఏళ్లనాటి రాతి చిత్తరువులు
మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో గల సత్పుడా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10 వేల ఏళ్ల కిందటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించారు. -
11న 370 అధికరణం రద్దుపై సుప్రీం తీర్పు
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. -
దుష్యంత్ దవే లేఖపై ఎస్సీబీఏ అధ్యక్షుడి దిగ్భ్రాంతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బహిరంగ లేఖ రాయడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు ఆదిశ్ సి అగ్రవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మోదీ చిత్రంతో విద్యార్థుల సెల్ఫీలు తప్పనిసరేమీ కాదు
ప్రధాని మోదీ చిత్రంతో విద్యార్థులు సెల్ఫీ దిగేందుకు వీలుగా కళాశాలల్లో ఒక సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్థించుకున్నారు. -
యాజమాన్య విద్యావ్యవస్థలో మార్పులు అవసరం
దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం యాజమాన్య విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. -
తనపై వీడియో క్లిప్ రావడంపై ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ ఆవేదన
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గురువారం రాజ్యసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అభివాదం చేసే సమయంలో ఆయన చేతులు జోడించి, శరీరాన్ని ముందుకు వంచిన భంగిమను పరిహసించే రీతిలో ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమంలో ప్రచారంలోకి వచ్చింది. -
ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ప్రధాన కార్యదర్శి పాటించాల్సిందే
దేశరాజధాని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం నియమించినా, ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
అమెరికా, కెనడా ఆరోపణలపై సమాన వైఖరి సాధ్యం కాదు
అమెరికాలో సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్రలో భారతీయుడి పాత్రపై ఆ దేశం చేసిన ఆరోపణలపై మన దేశం దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ గురువారం పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక శుక్రవారం లోక్సభ ముందుకు రానుంది. -
తెలుగు సహా పది భాషల్లో కేశవానంద భారతి తీర్పు
‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పును సుప్రీంకోర్టు తెలుగు సహా పది భాషల్లోకి తర్జుమా చేసింది. -
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. -
తేజస్ కొనుగోలుకు 4 దేశాల ఆసక్తి
దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ను కొనుగోలు చేసేందుకు నైజీరియా, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్టు ఆసక్తి... -
9 మంది ఎంపీల రాజీనామాలకు లోక్సభ స్పీకర్ ఆమోదం
ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన 9 మంది ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ఆమోదించారు. -
కేరళ సీఎం, గవర్నర్ మధ్య మరోసారి మాటల యుద్ధం
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. -
అర్జున్ ముండాకు వ్యవసాయశాఖ అదనపు బాధ్యతలు
కేంద్ర మంత్రి పదవులకు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్సింగ్ పటేల్, రేణుకాసింగ్ సమర్పించిన రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదించారు. -
చైనా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు భారత్లో లేవు : కేంద్రం
ఏప్రిల్ నుంచి సెప్టెంబరు దాకా ఆర్నెల్ల కాలంలో దిల్లీలోని ఎయిమ్స్లో ఏడు బ్యాక్టీరియా కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఖతార్లో మరణశిక్ష పడిన బాధితులతో భారత రాయబారి భేటీ
గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత్కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందిని ఈ నెల మూడున ఖతార్లోని భారత రాయబారి కలిశారు. -
మెఫ్తాల్ వినియోగంతో దుష్ప్రభావాల ముప్పు!
కీళ్లవాతం, నెలసరి నొప్పిని తప్పించుకునేందుకు ప్రజలు అధికంగా వినియోగించే మెఫ్తాల్ ఔషధం కొన్ని దుష్ప్రభావాలకూ కారణమయ్యే ముప్పు లేకపోలేదని భారత ఔషధప్రబంధ కమిషన్ (ఐపీసీ) హెచ్చరించింది!


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
-
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య