Rajnath Singh: ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి.. పాకిస్థాన్కు భారత్ చురకలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ను (PoK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్కు పెద్ద విషయమేమీ కాదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదంపై భారత్-అమెరికా చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ (Pakistan) అభ్యంతరం వ్యక్తం చేయడంపై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) దీటుగా స్పందించారు. కశ్మీర్ వంటి అంశాలపై మాట్లాడేందుకు బదులు.. ముందు మీ దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించుకోవాలని బదులిచ్చారు. భారత జాతీయ భద్రత అంశంపై జమ్మూలో కీలక ప్రసంగం చేసిన ఆయన .. పాక్ ఆక్రమిత కశ్మీర్ను (PoK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్కు పెద్ద విషయమేమీ కాదన్నారు.
‘కశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావించినప్పటికీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ముందు మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తే.. అక్కడ ఎప్పుడేం జరిగినా ఆశ్చర్యం లేదు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత్కు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. భారత భూభాగంలో ఉన్నవారు ఎంత ప్రశాంత జీవనం సాగిస్తున్నారో పాక్ ఆక్రమణలో ఉన్న ప్రజలు చూస్తున్నారు. అదే పాక్ మాత్రం వారికి అన్యాయం చేస్తోంది. పీఓకే అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్లో అంతర్భాగమే’ అని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా పీఓకేను ఆక్రమించుకోవడం వల్ల పాకిస్థాన్కు ఎటువంటి అధికారాలు ఉండవని.. ఇది భారత్లో అంతర్భాగమని పార్లమెంటు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. కేవలం ఒక్కసారి కాకుండా.. అనేక తీర్మానాలను పార్లమెంట్ చేసిందన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు భారత్-అమెరికా దేశాలు కలిపి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఇరుదేశాలు సంయుక్తంగా నినదించాయి. ఈ క్రమంలో పాక్ భూభాగాన్ని ఉగ్రదాడులకు కేంద్రంగా ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని అమెరికా-భారత్లు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అది పూర్తిగా అసమంజసమైందని, ఏకపక్షంగా, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. పాకిస్థాన్ను ఉద్దేశించి అమెరికా, భారత్లు చేసిన ప్రకటన.. దౌత్యనియమాలకు విరుద్ధంగా ఉన్నాయని వాపోయింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్కు భారత్ మరోసారి దీటుగా సమాధానమిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!