1000 పడకలతో రిలయన్స్ కొవిడ్ ఆస్పత్రి
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. తన వంతు సహాయం చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన రెండు కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
కొవిడ్ బాధితులకు ఉచితంగా వైద్యం
5రోజుల్లో 400 పడకలు సిద్ధం - వెల్లడించిన రిలయన్స్ ఫౌండేషన్
ముంబయి: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. తన వంతు సహాయం చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన రెండు కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్నగర్లో వీటిని ఏర్పాటు చేస్తోన్న ఈ కేంద్రాల్లో.. కొవిడ్ బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తామని వెల్లడించింది. కేవలం ఐదు రోజుల్లోనే 400పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిని అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ ప్రతినిధులు వెల్లడించారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ధాటికి చాలా రాష్ట్రాల్లో ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఏ రూపంలోనైనా సహాయం చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. దీంతో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి కొవిడ్ పడకలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జామ్నగర్లో ఉన్న ప్రభుత్వ దంత వైద్యశాలలో ఆక్సిజన్ సదుపాయం ఉన్న 400 పడకలు సిద్ధంచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్ అధికారులు వెల్లడించారు. మరో 600 పడకలను జామ్నగర్లోని మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరో వారం, పది రోజుల్లోనే పూర్తిస్థాయిలో దీన్ని సిద్ధం చేస్తామని రిలయన్స్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వీటితో మొత్తం కలిపి 1875 పడకలను కొవిడ్ కేర్ కోసం రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.
రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోన్న ఈ కొవిడ్ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని రాష్ట్రప్రభుత్వం సమకూరుస్తుందని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. ఇక ఆసుపత్రిలో వైద్య పరికరాలు, ఇతర సామగ్రితోపాటు చికిత్సకు అవసరమయ్యే సదుపాయాలను మాత్రం రిలయన్స్ సమకూరుస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్నగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు సేవలు అందుతాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 15వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షా 33వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 174 మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్ బాధితుల్లో 6830 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 2లక్షలు దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో ‘సీఐఎస్ఎఫ్’ నిర్వహించనుంది. 3300 మందికిపైగా సిబ్బంది సోమవారం (మే 20) నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీకి దిగడంపై ప్రధాని మోదీ స్పందించారు. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. -
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
భాజపా తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటి కంగనా రనౌత్.. ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ను వీడుతారా అనే ప్రశ్నకు బదులిచ్చారు. -
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
ఆప్ నేత స్వాతి మాలీవాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. -
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. -
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్