PM Modi: ప్రధానికి ఛాయ్‌ ఇచ్చిన రోబో.. ఫొటో మిస్‌ అవ్వొద్దన్న మోదీ

గుజరాత్‌లో ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌ గ్యాలరీని ప్రధాని మోదీ (PM Modi) సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ రోబో సర్వ్‌ చేసిన ఛాయ్‌ని ప్రధాని ఆస్వాదించారు.

Published : 27 Sep 2023 16:07 IST

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తన సొంత రాష్ట్రం గుజరాత్‌ (Gujarat)లో పర్యటిస్తున్నారు. ‘వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌’ 20వ వార్షికోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌ గ్యాలరీ (Robotics Gallery)ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆ గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి ఛాయ్‌ (Chai) ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘గుజరాత్‌ సైన్స్‌ సిటీలో రోబోటిక్స్‌ గ్యాలరీ ఎంతగానో ఆకట్టుకుంది. రోబో మాకు ఛాయ్‌ ఇచ్చిన ఫొటోను మిస్‌ అవ్వొద్దు’’ అని మోదీ ఆ ఫొటోలను క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ గ్యాలరీలో అధునాతన రోబోలను ఆసక్తిగా తిలకించిన ప్రధాని.. వాటిని తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు.

2003లో గుజరాత్‌కు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వైబ్రంట్‌ గుజరాత్‌ తొలి సదస్సు జరిగింది. నాటి సంగతులను మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ తొలి సదస్సు జరిగినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులెవరూ సమావేశాలకు రాలేదు. నేను అభివృద్ధి గురించి ఆలోచిస్తే.. వారు రాజకీయాలు చూశారు’’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని