Sharad Pawar: డబ్ల్యూఎఫ్ఐపై వేటు ఆలస్యమైంది కానీ: శరద్ పవార్ వ్యాఖ్యలు
డబ్ల్యూఎఫ్ఐ(WFI) కొత్త పాలక వర్గం అత్యుత్సాహం కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొరడా ఝళిపించింది. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.
పుణె: కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) పై సస్పెన్షన్ విధిస్తూ కేంద్ర క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని క్రీడాశాఖ కాస్త ముందుగా తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
డబ్ల్యూఎఫ్ఐ(WFI) నియమావళికి విరుద్ధంగా ఈ నెల 28 నుంచి అండర్-15, 20 జాతీయ ఛాంపియన్షిప్స్ నిర్వహిస్తామని ప్రకటించడం, పాత కార్యవర్గం (పరోక్షంగా బ్రిజ్భూషణ్) నియంత్రణలోనే ఇంకా సమాఖ్య ఉండటం లాంటి కారణాలతో క్రీడా శాఖ కొత్త పాలక వర్గంపై కొరడా ఝళిపించింది. దీనిపై పవార్ స్పందిస్తూ.. ‘మహిళా రెజ్లర్ల పట్ల అభ్యంతరకర ప్రవర్తన విషయంలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఇంకా ముందుగానే తీసుకొని ఉండాల్సింది. ఈ నిర్ణయం ఆలస్యం అయినప్పటికీ.. ప్రస్తుత చర్యను స్వాగతిస్తున్నాను’ అని వెల్లడించారు.
‘రైతులపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన భాజపా’
లైంగిక వేధింపుల ఆరోపణలతో మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్(Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తదితర రెజ్లర్లు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికల్లో అతడి సన్నిహితుడు గెలుపొందడం వారిని కలచివేసింది. దాంతో కొందరు రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు, మరికొందరు అవార్డులు తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే క్రీడామంత్రిత్వశాఖ డబ్ల్యూఎఫ్ఐ కొత్త పాలకమండలిపై వేటు వేసింది.
దీనిపై సాక్షి మలిక్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది మంచి అడుగు అని పేర్కొన్నారు. మరోపక్క ఈ పరిణామాల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు, ఆటతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు చెప్పాడు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?