Afghan Food Crisis: ఆకలితో అలమటిస్తోన్న అఫ్గాన్.. సగం మంది పస్తులే!
అఫ్గాన్లో లక్షల మందికి పూర్తి స్థాయిలో తిండి దొరకక పస్తులే ఉంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ శీతాకాలంలో దాదాపు సగం మంది అఫ్గాన్వాసులు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారని హెచ్చరిస్తున్నాయి.
ఆహార సంక్షోభం తీవ్రమైందన్న ఐక్యరాజ్యసమితి
కాబుల్: తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్లో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే లక్షల మందికి పూర్తి స్థాయిలో తిండి దొరకక పస్తులే ఉంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ శీతాకాలంలో దాదాపు సగం మంది అఫ్గాన్వాసులు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారని పేర్కొంటున్నాయి. తక్షణమే వీటి నుంచి బయటపడే చర్యలు చేపట్టకపోతే అఫ్గానీయుల ఆకలి కేకలతో అక్కడ దారుణ పరిస్థితులు ఏర్పడుతాయని ఐక్యరాజ్యసమితి మరోసారి హెచ్చరించింది.
‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించకుంటే ఈ శీతాకాలంలో లక్షల మంది అఫ్గాన్ వాసులు వలస వెళ్లడమో లేదా ఆకలితో అలమటించడమో ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అఫ్గాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం యెమన్, సిరియా దేశాల కంటే అత్యంత తీవ్రమైనది. ప్రపంచంలోనే దారుణమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గాన్లో ఆహార భద్రత పూర్తిగా కుప్పకూలింది. మహా విపత్తుకు కౌంట్డౌన్ మొదలయ్యిందని.. తక్షణమే చర్యలు చేపట్టకపోతే మన చేతులతోనే విపత్తును చవిచూస్తాం’ అని ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బియాస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలితో పిల్లలు చనిపోతున్నారన్న ఆయన.. వారికి సరైన ఆహారం అందిస్తామనే భరోసా కూడా ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డబ్బు రూపంలో నిధులను సత్వరమే అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డేవిడ్ బియాస్లీ అభిప్రాయపడ్డారు.
ప్రతి ఇద్దరిలో ఒకరికి తీవ్ర ఆహార కొరత..
అఫ్గాన్లో ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)తోపాటు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) హెచ్చరించాయి. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు ఫేజ్ 3 సంక్షోభం లేదా ఫేజ్ 4 ఎమర్జెన్సీ ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశాయి. ఫేజ్ 4 అంటే తీవ్ర కరవుకు దగ్గరలో ఉన్నట్లు భావిస్తారు. ఈ శీతాకాలంలో ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రయత్నాలు చేస్తున్నాం..
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి తమ ప్రజలను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆహారం, దుస్తులు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఈ ఇబ్బందులు పరిష్కారమవుతాయని ముజాహిద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కరువు పరిస్థితులపై మాట్లాడిన ఆయన.. ఈ శీతాకాలం పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు.
ఇదిలాఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్ను అంతర్జాతీయంగా గుర్తించేందుకు దాదాపు అన్ని దేశాలు వెనకాడుతున్నాయి. ఇదే సమయంలో అఫ్గాన్పై ప్రపంచ దేశాలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తున్నాయి. వీటితోపాటు ఇస్లామిక్ స్టేట్ దాడులు కూడా ఎక్కువ కావడం అఫ్గానీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు వాతావరణ పరిస్థితులతో అక్కడ తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వేల మంది పేద ప్రజలు పొట్టచేతబట్టుకుని నగరాలకు తరలిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.