Mehul Choksi: ఆంటిగ్వాకు ఛోక్సీ.. భారత్కు ఎప్పుడో?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ భారత్కు రాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కన్పిస్తున్నాయి. నాడీ సంబంధ చికిత్స నిమిత్తం ఆంటిగ్వా వెళ్లేందుకు డొమినికా హైకోర్టు
బెయిల్ మంజూరుతో ‘అప్పగింత’ కేసు మరింత ఆలస్యం
డొమినికా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ భారత్కు రాకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కన్పిస్తున్నాయి. నాడీ సంబంధ చికిత్స నిమిత్తం ఆంటిగ్వా వెళ్లేందుకు డొమినికా హైకోర్టు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో 51 రోజుల కస్టడీ అనంతరం నేడు ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో తిరిగి ఆంటిగ్వా చేరుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
ఈ ఏడాది మే 23న ఆంటిగ్వాలో ఉన్నట్టుండి అదృశ్యమైన ఛోక్సీ రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. క్యూబా పారిపోయే ప్రయత్నంలో డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించడంతో అతడిని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అయితే ఛోక్సీని కిడ్నాప్ చేసి బలవంతంగా డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు బలంగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై డొమినికా హైకోర్టులో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఛోక్సీ గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పారిపోయే అవకాశం ఉన్నందున అతడి పిటిషన్ను డొమినికా కోర్టు తిరస్కరించింది. అయితే తాజాగా అనారోగ్య కారణాల దృష్ట్యా మరోసారి బెయిల్ కోసం ఛోక్సీ అభ్యర్థించారు. తీవ్రమైన హెమటోమాతో బాధపడుతున్న అతడికి వెంటనే న్యూరాలజిస్టు, న్యూరో సర్జికల్ కన్సల్టెంట్తో చికిత్స అందించాలని వైద్యులు సిఫార్సు చేశారు. అయితే ప్రస్తుతం ఆ వైద్య సేవలు డొమినికాలో అందుబాటులో లేకపోవడంతో ఆంటిగ్వా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఛోక్సీ కోరారు.
దీంతో ఛోక్సీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10 వేల కరీబియన్ డాలర్ల (సుమారు రూ.2.75 లక్షలు)ను పూచీకత్తుగా సమర్పించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. ఛోక్సీ ఆరోగ్యం కుదుటపడి డొమినికా తిరిగి వచ్చేంతవరకు అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణపై కొనసాగుతున్న విచారణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అతడిని భారత్కు తీసుకురావాలన్న ప్రయత్నాలకు విఘాతం కలిగినట్లయింది.
ఎన్నేళ్లు పట్టేనో..
ఛోక్సీని డొమినికా పోలీసులు అరెస్టు చేసిన విషయం బయటకు రాగానే.. అతడిని భారత్కు తీసుకొచ్చేందుకు ఇక్కడి దర్యాప్తు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేశాయి. ఇందుకోసం ఓ ఉన్నతస్థాయి అధికారుల బృందం ఆ మధ్య డొమినికా వెళ్లి న్యాయస్థానంలో పత్రాలు కూడా సమర్పించింది. అయితే డొమినికాలో ఛోక్సీపై ఉన్న కేసుల్లో న్యాయస్థానం తీర్పు వస్తేనే ఆయన అప్పగింతకు అవకాశం లభిస్తుంది. తాజాగా అతడికి బెయిల్ మంజూరవడంతో అక్రమంగా ప్రవేశించారన్న కేసులో విచారణ వాయిదా పడింది. ఇది మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా స్పష్టత లేదు. దీంతో ఇప్పుడప్పుడే అతడిని భారత్కు తీసుకొచ్చే అవకాశాలు కన్పించట్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది. -
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ