Omicron: వారం క్రితం హెచ్చరించిన సునామీ ఇప్పుడు మమల్ని తాకుతోంది..!
అమెరికా, ఆస్ట్రేలియా, మరీ ముఖ్యంగా ఐరోపా దేశాలు కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. వీటిలో కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
ప్రపంచాన్ని చుట్టుముడుతోన్న ఒమిక్రాన్ వేవ్..
ఇంటర్నెట్డెస్క్: అమెరికా, ఆస్ట్రేలియా.. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాలు కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. వీటిలో కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ పరిస్థితికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆజ్యం పోస్తోంది. రానున్న నెలల్లో ఇది తీవ్రంగా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒమిక్రాన్.. మెరుపు వేగంతో..
ఐరోపాలో ఒమిక్రాన్ మెరుపు వేగంతో వ్యాపిస్తోందని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ హెచ్చరించారు. రానున్న నెలల్లో దీని ఉద్ధృతి తీవ్రంగా ఉండనుందన్నారు. యూకే నుంచి వస్తోన్న ప్రయాణికులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్లో తాజాగా 58,128 మందికి వైరస్ సోకింది. జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, నెదర్లాండ్స్లో కరోనా వైరస్ను అరికట్టే లక్ష్యంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జర్మనీలో నిన్న 50వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. తాము మున్ముందు ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం కావాలని జర్మనీ ఆరోగ్య మంత్రి అన్నారు. ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్లో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో వాటిని రిస్క్ దేశాలుగా జర్మనీ పేర్కొంది.
బ్రిటన్లో లక్షకు చేరువగా కేసులు.. మూడో రోజు రికార్డు!
ఒమిక్రాన్ వేరియంట్తో సతమతమవుతున్న బ్రిటన్లో మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. నిన్న 93,045 మందికి వైరస్ సోకింది. ఒమిక్రాన్ వేరియంటే తాజా విజృంభణకు మూలమని అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉందని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. వారం క్రితం తాను హెచ్చరించిన సునామీ ఇప్పుడు మమ్మల్ని తాకడం ప్రారంభించిందన్నారు. ఈ కొత్త వేరియంట్ కట్టడికి ఆ దేశం వ్యాక్సినేషన్ల మీద దృష్టి పెట్టింది. సామూహిక బూస్టర్ కార్యక్రమం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
శీతకాలం వేళ అమెరికాలో ఒమిక్రాన్ అలజడి..
శీతకాలం, పండగ సీజన్ వేళ.. అమెరికాను ఒమిక్రాన్ కలవరపెడుతోంది. గత జనవరిలో డెల్టా వేరియంట్ అగ్రదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఇప్పుడు ఒమిక్రాన్ ఉద్ధృతి చూపిస్తోంది. తాజాగా అక్కడ 1.7లక్షల మందికి కరోనా సోకింది. ఈ సెప్టెంబర్ తర్వాత ఇదే భారీ పెరుగుదల. టీకాలు తీసుకోని వారికి ఈ శీతకాలం తీవ్రంగా ఉండనుందని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు.
ఆస్ట్రేలియాలో మూడో రోజు రికార్డు కేసులు..
ఆస్ట్రేలియాలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉంది. న్యూ సౌత్ వేల్స్లో 2,482, విక్టోరియాలో 1,504, క్వీన్స్లాండ్లో 31 కేసులొచ్చాయి. మొత్తంగా ఆ దేశంలో 3,820 మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం తమ దేశంలో ఐరోపా, ఉత్తర అమెరికాలోని పరిస్థితి లేదని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. ప్రజలంతా వైరస్తో కలిసి జీవించడం అలవాటు చేసుకున్నందున.. తాము ప్రధానంగా ఆసుపత్రిల్లో చేరిక, వెంటిలేటర్లు, ఐసీయూల్లో ఉన్నవారిపైనే దృష్టిపెట్టాల్సి ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడాన్ని విపక్ష నేతలు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయమని ఆప్ అభివర్ణించింది. -
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. -
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్