China Bags: జీ20లో చైనా బ్యాగుల కలకలం.. రెండు కాదు.. మొత్తం 20 బ్యాగులట..!
Suspicious china bags: జీ20 సదస్సులో చైనా ప్రతినిధులు తీసుకొచ్చిన ‘అసాధారణ బ్యాగుల’పై భద్రతా సిబ్బంది దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తం 20 బ్యాగులు అనుమానాస్పదంగా కన్పించినట్లు సమాచారం.
దిల్లీ: జీ20 సదస్సు (G20 Summit)లో చైనా (China) ప్రతినిధుల బృందం వెంట ఉన్న కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా (Suspicious bags) కనిపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత రెండు బ్యాగులని వార్తలు రాగా.. మొత్తం 20 అనుమానాస్పద బ్యాగులు కన్పించినట్లు తాజాగా పలు మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి. అంతేగాక, వాటిలో నిఘా పరికరాలు (surveillance equipment) ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జీ20 సదస్సు (G20 Summit) కోసం విచ్చేసిన ఆరుగురు ప్రతినిధుల చైనా బృందం దిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో బస చేసింది. అయితే, వారి వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో కొన్ని అసాధారణ కొలతల్లో కన్పించాయి. సాధారణంగా విదేశాల నుంచి వచ్చే వారి వస్తువులను ఎయిర్పోర్టులోనే పూర్తిగా తనిఖీ చేస్తారు. కానీ, ‘వియన్నా ఒప్పందం’ కింద ఉన్న దౌత్యపరమైన ప్రొటోకాల్స్ ప్రకారం.. చైనా ప్రతినిధుల వస్తువులను ఎయిర్పోర్టులో స్కాన్ చేయకుండానే పంపించారు.
తెలుగు విద్యార్థిని మృతి కేసులో అమెరికా పోలీసుల తీరుపై భారత్ అసహనం
అయితే, హోటల్కు చేరుకున్నాక అక్కడి భద్రతా సిబ్బంది.. ఆ బ్యాగుల సైజులు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు. 1x1 మీటర్ల పొడవు, వెడల్పు, మందంగా ఉన్న ఆ బ్యాగులను స్కానర్ కింద ఉంచాలని సదరు ప్రతినిధులను భద్రతా అధికారులు కోరారు. అందుకు వారు నిరాకరించడంతో కొంతసేపు హైడ్రామా నెలకొంది. 12 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత చైనా అధికారులు ఆ బ్యాగ్లను ఎంబసీకి పంపడానికి అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మొత్తం 20 బ్యాగులు ఇలా సైజుల్లో ఉన్నట్లు తాజాగా పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఆ బ్యాగుల్లో ఏముందన్నది మాత్రం తెలియరాలేదు. అందులో ‘ఆఫ్ ది ఎయిర్’ నిఘా పరికరాలు ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై భద్రతా సిబ్బంది దర్యాప్తు ప్రారంభించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై చైనా ఎంబసీ గానీ, ఆ దేశ ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా