Manipur Women: మణిపుర్ రణ క్షేత్రమేదైనా ముందుండేది మహిళామణులే!
Women In Manipur: మణిపుర్ ఆందోళనల్లో ఎక్కడ చూసినా మహిళలే ఎక్కువగా కన్పిస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో నారీమణులు ఇలా నిరసనల్లో పాల్గొనడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. దీని వెనుక కథేంటంటే?
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: మణిపుర్ (Manipur)లో నెలకొన్న ఉద్రిక్తతలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి వేలాది మహిళలు (Women in Protest) ఆయన ఇంటికి పోటెత్తారు. ఆయన కాన్వాయ్ను చుట్టుముట్టి.. రాజీనామా పత్రాలను లాక్కొని చించేశారు. దీంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇటీవల 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టి.. వారి చేతిలో బందీలుగా ఉన్న మిలిటెంట్లను విడిపించుకుని తీసుకెళ్లారు. ఈ రెండు ఘటనలే కాదు.. జాతుల మధ్య వైరంతో మణిపుర్లో తాజాగా చోటుచేసుకున్న ఆందోళనల్లో మహిళలు ముందుంటున్నారు. అయితే, ఇది ఈనాటి మార్పు కాదు.. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన ఆందోళనల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు.
రెండు సార్లు ‘మహిళా యుద్ధాలు’..
1891లో జరిగిన ఆంగ్లో-మణిపుర్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యం అధీనంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 1904లో మణిపుర్లో కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. 17-60 ఏళ్ల మధ్య పురుషులు ప్రతి నెలా 10 రోజుల పాటు ఉచితంగా పనిచేసేలా అప్పటి బ్రిటిష్ ఏజెంట్ లెఫ్టినెంట్ కల్నల్ హెన్రీ సెయింట్ పాట్రిక్ మ్యాక్స్వెల్.. ఓ ప్రణాళికను ప్రకటించారు. ఇది తెలుసుకున్న మహిళలు వేలాదిగా రోడ్డెక్కారు. బ్రిటిష్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మాక్స్వెల్ నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో ఇంగ్లీష్ ప్రభుత్వం ఈ విధానంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మహిళలు చేపట్టిన ఈ ఆందోళనను అప్పట్లో ‘నుపి లాన్’గా పిలిచారు. అంటే ‘మహిళా యుద్ధం’ అని అర్థం..!
ఆ తర్వాత 1939లో మరోసారి ‘నుపి లాన్’ ఉద్యమం చోటుచేసుకుంది. అప్పట్లో మణిపుర్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున బియ్యం విక్రయాలు చేపట్టింది. దీంతో స్థానికంగా కొరత ఏర్పడి బియ్యం ధరలు పెరిగాయి. ఫలితంగా మార్కెట్ కుదేలైంది. దీంతో మహిళలు మళ్లీ ఆందోళన బాటపట్టారు. దాదాపు 4వేల మంది మహిళలు రాయల్ దర్బార్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లారు. దీంతో పరిస్థితిని నియంత్రించేందుకు మణిపుర్ మహరాజ్ అస్సాం రైఫిల్స్ను రంగంలోకి దించారు. ఆందోళనకారులను జవాన్లు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అనేక మంది మహిళలు గాయపడ్డారు. అయినా వారు అక్కడి నుంచి వెళ్లలేదు. దీంతో ఆ మరుసటి రోజే మహరాజ్ బియ్యం ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ యుద్ధం జరిగిన డిసెంబరు 12ను ఇప్పటికీ ‘నుపి లాన్ డే’ నిర్వహిస్తున్నారు.
అన్యాయంపై గళమెత్తిన ‘మీరా పైబిస్’
1970ల్లో మణిపుర్లో అక్రమ మద్యం విక్రయాలు, మాదకదవ్ర్యాల వినియోగం విపరీతంగా ఉండేది. దీంతో వీటిని ఎదిరిచేందుకు మహిళలు ‘మీరా పైబిస్’ పేరుతో బృందాలు ఏర్పడ్డారు. వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో చాలా చోట్ల ఈ అక్రమ మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. ఆ తర్వాత అక్రమ చొరబాటుదార్లను అరెస్టు లేదా అదుపులోకి తీసుకునేందుకు వీలుగా సాయుధ బలగాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను వ్యతిరేకిస్తూ కూడా ఈ బృందాలు పోరాడాయి. రాత్రి వేళల్లో టార్చిలు చేతిలో పెట్టుకుని వీరు తమ గ్రామాల్లో గస్తీ నిర్వహించేవారు. యువకులను సైన్యం బలవంతంగా తీసుకెళ్లకుండా తమవారిని కాపాడుకునేందుకు ఇలా చేసేవారు.
2004లో మనోరమ థంగజామ్ అనే మహిళను అస్సాం రైఫిల్స్ సిబ్బంది బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె ఘోరమైన స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను నిరసిస్తూ అప్పట్లో 12 మంది మహిళలు అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ముందు నగ్న ప్రదర్శన చేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత ఈ మీరా పైబిస్ బృందాలు అనేక సామాజిక సమస్యలపై దృష్టిపెట్టాయి. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య బయటపడినా.. ఈ బృందాలు తమ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నాయి.
ఉక్కు మహిళదీ ఈ రాష్ట్రమే..
ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలది కూడా ఈ రాష్ట్రమే. 2000 నవంబర్ 5న ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆమె నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష 16 సంవత్సరాల పాటు కొనసాగింది. 500 వారాలకు పైగా ఆహారం, నీటిని తిరస్కరించి ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం నిరాహార దీక్ష చేసిన మహిళగా పేరుకెక్కారు. 2016 ఆగస్టు 9న దీక్ష ముగించారు.
తాజా ఆందోళనల్లోనూ కీలకంగా..
రిజర్వేషన్ల విషయంలో మైతేయ్, కుకీల మధ్య వైరం మొదలైంది. ఈ క్రమంలోనే మే 3వ తేదీన జరిగిన గిరిజన సంఘీభావ ర్యాలీ హింసాత్మకంగా మారడం ఘర్షణలకు బీజం వేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. చురాచాంద్పుర్, చాందేల్ వంటి ప్రాంతాల్లో మహిళలు రోడ్లను నిర్బంధించి నిరసనలు చేపడుతున్నారు. మానవహారాలుగా ముందుండి సాయుధ బలగాలను అడ్డుకుంటున్నారు. ఈ మధ్య దిల్లీలోని కేంద్ర మంత్రి అమిత్ షా నివాసం ముందు జరిగిన ఆందోళన కూడా మహిళా నేతృత్వంలో జరిగినదే.
‘‘ఆందోళనల సమయంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు లేదా ఇద్దరు మహిళలను పంపాలని గ్రామ/కమ్యూనిటీ పెద్దలు అడుగుతారు. వారంతా షిఫ్టుల్లో పనిచేస్తారు. రాష్ట్రంలోని అన్ని జాతుల్లో ఈ విధానం కొనసాగుతోంది. ఒకవేళ ఏ కుటుంబమైనా వారింటి నుంచి మహిళలను పంపించకపోతే వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఇది అనధికారిక వ్యవస్థే అయినా.. అనాదిగా కొనసాగుతోంది’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
అమ్మల మార్కెట్.. ఇక్కడ ప్రత్యేకం
అయితే, ఆందోళనల్లోనే కాదు ఇతర రంగాల్లోనూ ఇక్కడి మహిళలు ముందే ఉన్నారు. రాజధాని ఇంఫాల్లో ‘ఇమా కెయిథెల్’ పేరుతో ఓ పెద్ద బజార్ ఉంది. ఇది అమ్మల మార్కెట్. ఇందులో ఎక్కడ చూసినా మహిళా విక్రయదారులే కన్పిస్తారు. దాదాపు 3వేల నుంచి 5వేల మంది మహిళలు అనేక ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ప్రపంచంలోనే మహిళలు నిర్వహిస్తున్న అది పెద్ద మార్కెట్గా ఇది గుర్తింపు పొందింది. స్థానికులే గాక.. టూరిస్టులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు