‘రెహమాన్ రూ.3.47 కోట్లకు పన్ను కట్టలేదు’
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ రూ.3.47 కోట్ల మొత్తంపై పన్ను శాతం కట్టకుండా ఎగరవేశారంటూ ఆదాయ పన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. రూ.3.47 కోట్ల పారితోషికాన్ని నేరుగా తన ఛారిటబుల్ ట్రస్టుకు బదిలీ చేశారని ఫిర్యాదు చేశారు. 2011-12 సంవత్సరంలో రెహమాన్ పన్ను ....
పన్ను ఎగవేత.. అధికారుల ఫిర్యాదు
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ రూ.3.47 కోట్ల మొత్తానికి పన్ను కట్టకుండా ఎగవేశారంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. రూ.3.47 కోట్ల పారితోషికాన్ని నేరుగా తన ఛారిటబుల్ ట్రస్టుకు బదిలీ చేశారని ఫిర్యాదు చేశారు. 2011-12 సంవత్సరంలో రెహమాన్ పన్ను దాఖలు చేయడంలో వ్యత్యాసాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. యూకేకి చెందిన టెలికాం సంస్థ లిబ్రా మొబైల్స్కు రింగ్టోన్స్ కంపోజ్ చేసినందుకుగానూ రెహమాన్ రూ.3.47 కోట్ల పారితోషికం తీసుకున్నారని వివరించారు. 2011లో ఇది జరిగిందని, సరికొత్త రింగ్టోన్స్ కంపోజ్ చేసి ఇచ్చేలా.. సదరు సంస్థతో రెహమాన్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారని ఫిర్యాదులో తెలిపారు.
పారితోషికం నేరుగా రెహమాన్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందని, దానికి పన్ను కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. పన్ను కట్టిన తర్వాత.. ట్రస్టుకు బదిలీ చేయాలని, కానీ అలా చేయలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ వి భవానీ సుబ్బరాయన్తో కూడిన ధర్మాసనం రెహమాన్కు నోటీసులు జారీ చేసింది.
గత ఫిబ్రవరిలో రెహమాన్ రూ.6.79 కోట్ల బకాయి, రూ.6.79 కోట్ల జరిమానా చెల్లించాలని జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ (సీఈ) జారీ చేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు మధ్యంతర స్టే మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రెహమాన్ సినిమాలకు సంగీతం అందించడం ద్వారా తీసుకున్న పారితోషికానికి పన్ను చెల్లించలేదని జీఎస్టీ కౌన్సిల్ అప్పుడు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
తండేల్ మూవీ ఓటీటీ డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. -
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
Mahesh babu: మహేశ్ జుట్టులాగి ఆటపట్టించిన మంజుల.. క్యూట్ మొమెంట్స్ వైరల్..
ఓ పెళ్లి వేడుకకు మహేశ్బాబు హాజరుకాగా, ఆయన సోదరి మంజుల ఆటపట్టించారు.
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. -
బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. -
శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘థగ్లైఫ్’ గీత రచయితగా..
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. -
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు