కొత్త చిత్రానికి శ్రీకారం

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా విఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజేష్‌ దండ నిర్మాత. ఖుషీ రవి, కావ్యా థాపర్‌ కథానాయికలు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Updated : 20 Sep 2021 08:04 IST

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా విఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజేష్‌ దండ నిర్మాత. ఖుషీ రవి, కావ్యా థాపర్‌ కథానాయికలు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లరి నరేశ్‌ క్లాప్‌ కొట్టగా.. నాగశౌర్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు. విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. జెమినీ కిరణ్‌, సుధీర్‌ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ‘‘ఓ సూపర్‌ నేచురల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న చిత్రమిది. అక్టోబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సంగీతం: శేఖర్‌ చంద్ర, కూర్పు: చోటా కే ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సిద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని