Acharya: అంతకు మించి అవార్డు ఏం ఉంటుంది: ‘ఆచార్య’ ఆర్ట్ డైరెక్టర్ సురేశ్
‘ఆచార్య’ చిత్రం విడుదలకు ముందే భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.
హైదరాబాద్: ‘ఆచార్య’ చిత్రం విడుదలకు ముందే భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏ చిత్రానికి చేయని విధంగా సుమారు 20 ఎకరాల్లో ఆచార్య కోసం ధర్మస్థలి సెట్ను తీర్చిదిద్దారు. ఇండియన్ సినిమాలో ఒకే చోట ఇంత పెద్ద సెట్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవికి చెందిన 20 ఎకరాల సొంతస్థలంలో 4 నెలలపాటు శ్రమించి ధర్మస్థలి సెట్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ పర్యవేక్షణలో వందల మంది పనిచేసి ధర్మస్థలిని నిర్మించారు. దక్షిణాదిలోని ప్రఖ్యాత దేవాలయాలను తలపించేలా సురేష్ ధర్మస్థలిని తీర్చిదిద్దారు. పూర్తిగా పర్యావరణ హితంగా, చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన సెట్లో దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే మారేడుమిల్లిలో గ్రామీణ ప్రాంతాన్ని తలదన్నేలా పాదఘట్టం అనే మరోసెట్ వేసి చిరంజీవి, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలో ఆచార్య కోసం పనిచేసిన కళాదర్శకుడు సురేష్ సెల్వరాజన్ ఈటీవీతో తన అనుభవాలను పంచుకున్నారు.
‘‘ఆచార్య’లాంటి సినిమాకు పనిచేయడం నాకు దక్కిన అదృష్టం. కొరటాల శివకు ఏం కావాలో నాకు తెలుసు. ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఆయన ఊహాలను నేను అర్థం చేసుకోగలిగాను. ‘ఆచార్య’కు అది మరింత సులభమైంది. ‘భరత్’ పొలిటికల్ డ్రామా అయితే, ఇది అందుకు పూర్తి భిన్నం. సినిమా కోసం చాలా ప్రాంతాలు తిరిగాం. అయితే, కొన్ని చోట్ల షూటింగ్ చేసేందుకు అనుకూల పరిస్థితులు లేవు. దీంతో టెంపుల్ టౌన్ నిర్మించాం’’
‘‘నాలుగు నెలలకు పైగా ప్రీప్రొడక్షన్ వర్కు జరిగింది. టెంపుల్ సెట్ వేసేందుకు అందుకోసం 20 ఎకరాల స్థలం అవసరమైంది. చిరు సర్ అందుకు సహకారం అందించారు. సెట్లో ఏం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నాకు రోజంతా పట్టేది. రోజూ ఏడెనిమిది వందల మంది పనిచేసేవారు. డిజిటల్ రూపంలోనూ సెట్స్ వేయొచ్చు. కానీ, సహజత్వం కనిపించాలనే ఎంత పెద్ద గోపురాలైనా సెట్స్ వేసి తీశాం’’
‘‘భరత్ అనే నేను’కు వేసిన అసెంబ్లీ సెట్కు నాకు మంచి పేరు వచ్చింది. ‘ఆచార్య’ ఓపెన్ సెట్. వాతావరణ పరిస్థితుల వల్ల దెబ్బతినకుండా ఈ సెట్ వేశాం. నాలుగైదు ఏళ్లు అది ఏ మాత్రం దెబ్బతినదు. మేము వేసిన టెంపుల్ టౌన్ సెట్ చూసి చిరంజీవిగారు అభినందించారు. అంతకుమించిన అవార్డు ఇంకేముంటుంది. ఆయన తర్వాతి చిత్రానికి కూడా నాకు అవకాశం ఇచ్చారు. కథకు అవసరమైన సెట్ కావాలంటే నిర్మాత సహకారం కూడా అవసరం. నిరంజన్రెడ్డి అందుకు ఎంతగానో సహకరించారు’’
‘‘శివగారు టెంపుల్ సిటీ గురించి చెప్పగానే, చాలా ఆలయాలను సందర్శించాను. కేవలం కొన్ని ఆలయాల గర్భగుడులు మాత్రమే విభిన్నంగా ఉంటాయి. వాటిని రిఫరెన్స్గా తీసుకుని, ‘ఆచార్య’ కోసం ప్రత్యేకమైన ఆలయాన్ని తీర్చిదిద్దాం. తెరపై ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని చూస్తారు. మేము వేసిన గుడి సెట్ ఇంకెక్కడా ఉండదు. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో కొన్ని సెట్స్ రిపేర్ చేశాం. మళ్లీ పెయింటింగ్లు వేశాం. దీంతో ఇంకాస్త అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM