Vishnu Vishal: తండ్రి మాటలకు స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురైన హీరో

‘అరణ్య’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు విష్ణు విశాల్‌. హీరో కావాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే కోలీవుడ్‌లో స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్నారు....

Published : 05 Feb 2022 11:05 IST

చెన్నై: ‘అరణ్య’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు విష్ణు విశాల్‌. హీరో కావాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే కోలీవుడ్‌లో స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్‌ చిత్రం ‘ఎఫ్‌ ఐ ఆర్‌’. తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్‌ వేడుక చెన్నైలో జరిగింది. ఉగ్రవాదం, పోలీస్‌ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో పోలీస్‌ అధికారి, విష్ణు విశాల్‌ తండ్రి రమేశ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఇందులో భాగంగా, రమేశ్‌ మాట్లాడుతూ.. ‘‘మొదటిసారి ఓ సినిమా ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉంది. నా కొడుకు విష్ణుని చూస్తుంటే గర్వంగా ఉంది. తన వల్లే ఈ రోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నాను. నా కొడుకు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వారందరికీ నా కృతజ్ఞతలు. కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి ఎంతోమంది వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా మా వాడికి సాయం చేశారు. ముఖ్యంగా అభిమానులు తనని ఎంతో ఆదరించారు. అందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఇటీవల నేను ‘ఎఫ్‌ ఐ ఆర్‌’ చూశాను. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’’ అని చెప్పడంతో ఆయన మాటలు విని విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని