‘దృశ్యం-3’ త్వరలో సిద్ధం!

ఫ్యామిలీ డ్రామాలో క్రైమ్‌ థ్రిల్లర్‌ను మిళితం చేసి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన చిత్రం ‘దృశ్యం’. మొదటగా మలయాళంలో జీతూజోసెఫ్‌ డైరెక్షన్‌లో మోహన్‌లాల్‌, మీనా ప్రాధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ సూపర్‌హిట్‌ అవ్వడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో

Updated : 25 Feb 2021 20:34 IST

కొచ్చిన్‌: ఫ్యామిలీ డ్రామాలో క్రైమ్‌ థ్రిల్లర్‌ను మిళితం చేసి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన చిత్రం ‘దృశ్యం’. మొదటగా మలయాళంలో జీతూజోసెఫ్‌ డైరెక్షన్‌లో మోహన్‌లాల్‌, మీనా ప్రాధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ సూపర్‌హిట్‌ అవ్వడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌ అయ్యింది. ఆయా భాషల్లో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ప్రైమ్‌లో విడుదలైన ‘దృశ్యం-2’  సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. డైరెక్టర్‌ జోసెఫ్‌ తన టేకింగ్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశారు. తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే ‘దృశ్యం-3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయని, ముఖ్యంగా పార్ట్‌-3 క్లైమాక్స్‌ విన్న మోహన్‌లాల్‌, నిర్మాత ఆంటొనీ పెరంబువర్‌ ఎంతో ఆసక్తి కనబరచారని పేర్కొన్నారు. అయితే స్క్రిప్ట్‌ను మరింత ఆకట్టుకునేలా మలచాలంటే రెండు, మూడేళ్లు పడుతుందన్నారు.  కచ్చితంగా మూడో సీక్వెల్లో కూడా ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తామని భరోసా ఇచ్చారు. ‘దృశ్యం-2’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే హిందీలో అజయ్‌దేవ్‌గణ్‌, టబు సీక్వెల్‌లో నటించేందుకు అంగీకారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని