Akashvani Review: ఆకాశవాణి రివ్యూ
Akashvani Review: విభిన్న కథా చిత్రంగా ప్రచారమైన ‘ఆకాశవాణి’ సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: ఆకాశవాణి; నటీనటులు: సముద్రఖని, వినయ్ వర్మ, మిమి మధు, తేజ కాకుమాను, మాస్టర్ ప్రశాంత్ తదితరులు; సంగీతం: కాల భైరవ; సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు; ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్; నిర్మాత: పద్మనాభరెడ్డి; రచన, దర్శకత్వం: అశ్విన్ గంగరాజు; మాటలు: సాయిమాధవ్ బుర్రా ; విడుదల: 24-09-2021
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మన టాలీవుడ్. ఆ ముద్రను క్రమంగా తుడిచేసేందుకు ఈతరం దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా సినిమా కథల తీరు మారుతూ వస్తోంది. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా, వాస్తవానికి దగ్గరగా ఉండే కథలతో సినిమాలొస్తున్నాయి. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ‘ఆకాశవాణి’ సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాడు. కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమాను పద్మనాభరెడ్డి నిర్మించారు. సముద్రఖని ఓ కీలకపాత్రలో నటించారు. సోనీలివ్లో నేరుగా విడుదలైందీ సినిమా. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే: నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే ఒక అటవీ ప్రాంతం. కొండ-కోనల్లో నివసించే అక్కడి జనానికి దొర మాటే శాసనం. అక్కడే ఒక చెట్టు తొర్రలో ఉండే బండరాయిని దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. ఆ బండరాయి తర్వాత వాళ్లను బతికేంచేది, శాసించేది దొరేనని బలంగా నమ్ముతారు. గూడెం హద్దు దాటి బయట అడుగుపెడితే దేవుడు కఠినంగా శిక్షిస్తాడని, ప్రాణాలనూ హరిస్తాడనే భయాన్ని దొర వారిలో నూరిపోస్తాడు. ఆ భయాన్నే పెట్టుబడిగా పెట్టి తోటల్లో పనిచేయిస్తూ వాళ్ల శ్రమను దోచుకుంటాడు. బయటి నుంచి ఎవరైనా ప్రవేశించే ప్రయత్నాలు చేసిన వారి నెత్తురు కళ్లజూస్తాడు. కఠినమైన ఆంక్షల మధ్య అమాయకంగా బతుకుతున్న వారి జీవితాల్లోకి మరో దేవుడు వస్తాడు. అయితే బండరాయి రూపంలోనో, మనిషి రూపంలోనో కాదు. మాట్లాడే రేడియో రూపంలో సరికొత్తగా అవతరిస్తాడు. ఆ రేడియో వచ్చాక వారి జీవితాల్లో ఎలాంటి మార్పొచ్చింద?చీకట్లో బతుకుతున్న ఆ గూడెం ప్రజల్లో చైతన్యం ఎలా కలిగింది? వారి అజ్ఞానం తొలిగిపోయి, దొర అరాచకత్వం ఎలా బయటపడిందనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: రాజమౌళి శిష్యుడైన అశ్విన్ గంగరాజు మొదటి సినిమాకే ఇలాంటి భిన్నమైన కాన్సెప్ట్ను ఎంచుకోవడం అభినందనీయం. కథగా ఎంచుకున్న పాయింట్ ఆకట్టుకున్నప్పటికీ, దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో తడబడ్డాడు. సినిమాను రక్తికట్టించేలా తీయడంలో ఈ యువ దర్శకుడు మెప్పించలేకపోయాడు. అజ్ఞానంలో జీవించే అమాయక ప్రజలు, వారిని మేల్కొలిపేందుకు వచ్చే ఒక హీరో అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. హీరో స్థానంలో రేడియోను వాడుకోవడమే ఈ కథలో కొత్తదనం. దాని చుట్టూ ప్రేక్షకులను రంజింపజేసే సన్నివేశాలు లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి నిరాశ మిగులుతుంది. సినిమా మొదటి అర్ధగంటపాటు ఆ గూడెం ప్రజల అమాయకత్వాన్ని చూపించడానికే సరిపోయింది. అసలు కథలోకి వచ్చే సరికి ప్రేక్షకుడి ఓపిక నశించిపోతుంది. మొదటి అర్ధభాగమంతా దొర అరచకాలు, అక్కడి ప్రజల అమాయక జీవనం మీదే సన్నివేశాలన్నీ సాగుతాయి. రెండో అర్ధభాగంలో రేడియో వచ్చాక పెద్దగా మార్పేమీ ఉండదు. వారిలో అదే అమాయకత్వం. ఆకాశవాణితో ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆశించే ప్రేక్షకుడికి మిగిలేది నిరాశే. చంద్రం మాస్టరు(సముద్రఖని) వచ్చాక సినిమాలో కొంత వేగం పెరుగుతుంది. హిరణ్యకశిపుని కథను సినిమాలో వాడుకున్న విధానం బాగుంది. క్లైమాక్స్లో ఇంకా బలమైన సన్నివేశాలు పడాల్సింది. మంచి కథే అయినా.. సరైన కథనం, థ్రిల్కు గురిచేసే సన్నివేశాలు లేక సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. కొద్ది సేపు మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతిని మాత్రం ఇస్తుంది.
ఎవరెలా చేశారాంటే: ‘ఆకాశవాణి’లో నటించినవారంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అందరూ తమ సహజ నటనతో సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. మేకలు కాసే గిడ్డాగా మాస్టర్ ప్రశాంత్, అతడి తండ్రి రంగడిగా మధు హావభావాలతో ఆకట్టుకున్నారు. దొరగా వినయ్వర్మ, చంద్రం మాస్టరుగా సముద్రఖని ఒదిగిపోయారు. గూడెంలో అందరినీ భయపెట్టే సాంబడిగా తేజ కాకమాను నటన బాగుంది. విక్రమార్కుడులో అజయ్ పోషించిన టిట్లా పాత్రను గుర్తుచేశాడు. సముద్రఖని, గెటప్ శీను పాత్రలను మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది. సాయిమాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ‘కట్టే అయితే ఏంటి? కటిక రాయి అయితే ఏంటి? కష్టాలు తీర్చేది దేవుడే కదా’లాంటి మరొకొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. మనల్ని కొంతసేపు గూడెం ప్రజల్లోకి తీసుకెళ్లేలా అడవిని చక్కగా చూపించారు. కాల భైరవ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకు తగినట్లుగానే ఉంది. సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా సినిమా బాగున్నప్పటికీ మొత్తంగా ప్రేక్షకుడిని మెప్పించే కథను అందివ్వడంలో మాత్రం చిత్రబృందం విఫలమైంది.
బలాలు
+ నటీనటులు ప్రతిభ
+ సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు
- బలమైన సన్నివేశాలు లేకపోవడం
- నిదానంగా సాగే కథనం
చివరగా: ప్రేక్షకుల స్టేషన్ను సరిగా ట్యూన్ చేయలేకపోయిన ‘ఆకాశవాణి’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?