Akshay Kumar: ఆ పాన్‌ మసాలా ప్రకటన ఇప్పటిది కాదు.. రూమర్స్‌పై స్పందించిన అక్షయ్‌ కుమార్‌..

తాను మళ్లీ పాన్‌ మసాలా ప్రకటనల్లో నటిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) స్పందించారు. పూర్తి వివరణతో ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

Published : 10 Oct 2023 13:27 IST

ముంబయి: తనపై వస్తున్న రూమర్స్‌ను బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ఖండించారు. ఆయన మళ్లీ పాన్‌ మసాలా ప్రకటనలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన అక్షయ్‌.. వివరణ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

అక్షయ్‌ కుమార్‌ గతంలో నటించిన ఓ పాన్ మసాలా ప్రకటన సోషల్‌ మీడియాలో తాజాగా షేర్‌ అవుతోంది. దీంతో ఆయన మళ్లీ ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన అక్షయ్‌.. ‘‘ప్రస్తుతం వస్తోన్న ప్రకటన 2021 అక్టోబర్‌లో చిత్రీకరించినది. అగ్రిమెంట్‌ ప్రకారం దీన్ని 2023 నవంబర్‌ వరకు ప్రసారం చెయొచ్చు. అంతే కానీ, ఇది ఇప్పుడు చిత్రీకరించింది కాదు. నేను ఇలాంటి ప్రకటనల్లో నటించనని బహిరంగంగానే వెల్లడించాను. ఆ ప్రకటన తర్వాత నేను ఇప్పటి వరకూ ఇలాంటి వాటిల్లో నటించలేదు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’’ అంటూ రాసుకొచ్చారు. 

‘ఇండియన్‌ 2’ నుంచి అప్‌డేట్‌.. మరి ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎప్పుడు!

గతంలోనూ ఇలాంటి రూమర్స్‌రాగా అక్షయ్‌ కుమార్‌ అప్పుడు కూడా వీటిని ఖండించారు. నిర్దేశిత వ్యవధి వరకు ఆ ప్రకటనను ప్రసారం చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు. అలాగే దాని కోసం తాను తీసుకున్న డబ్బును కూడా ఒక మంచి పనికి వినియోగించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వాటి ఎంపికలో జాగ్రత్త పడతానని చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ఓమైగాడ్‌2’తో విజయాన్ని అందుకున్నారు అక్షయ్‌ కుమార్‌. తాజాగా ‘మిషన్‌ రాణిగంజ్‌’తో (Mission Raniganj) పలకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని