Anasuya: మగజాతి పరువు తీస్తున్నారంటూ నెటిజన్‌పై అనసూయ ఫైర్‌

డ్రెస్సింగ్ విషయంలో తరచూ పలువురు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు నటి అనసూయ. వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని, నటిగా వెండితెర ప్రియుల్ని అలరిస్తున్న అనసూయ తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు....

Published : 04 Apr 2022 13:19 IST

హైదరాబాద్‌: డ్రెస్సింగ్ విషయంలో తరచూ పలువురు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు నటి అనసూయ. వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని.. నటిగా వెండితెర ప్రియుల్ని అలరిస్తోన్న ఆమె తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మగజాతి పరువు తీస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే.. గతంలో పొట్టి గౌను ధరించి అనసూయ షేర్‌ చేసిన ఫొటోలపై సోమవారం ఉదయం ఓ నెటిజన్‌ స్పందించారు. ‘‘అనసూయ గారు.. మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి దుస్తులు వేసుకుంటూ తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారు’’ అని అసహనం వ్యక్తం చేశాడు. దానిపై స్పందించిన అనసూయ.. ‘‘దయచేసి మీరు మీ పని చూసుకోండి. నన్ను నా పని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’’ అని కామెంట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని