టీజర్‌ చూసి భయపడ్డా: సునీల్‌

 శ్రీరాం, సంచితా పదుకొణె హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘అసలేం జరిగింది?’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఆ సినిమా టీజర్‌ను ప్రముఖ నటుడు సునీల్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్‌ చూసిన

Published : 05 Jan 2021 02:19 IST

హైదారాబాద్‌: శ్రీరాం, సంచితా పదుకొణె హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘అసలేం జరిగింది?’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఆ సినిమా టీజర్‌ను ప్రముఖ నటుడు సునీల్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్‌ చూసిన తర్వాత ఆయన మాట్లాడారు. టీజర్‌ చూసి తాను నిజంగా భయపడ్డానన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా వైవిధ్యమైన అంశంతో తీసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీరాంతో కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించానని, తను మంచి నటుడని కొనియాడారు. సినిమా పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయని అన్నారు. ఎక్సోడస్ మీడియా మరిన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తుందని ఆశిస్తున్నానన్నారు.

నిర్మాత మైనేని నీలిమా చౌదరి మాట్లాడుతూ.. సినిమా మొత్తం థ్రిల్‌ ఉంటుందని చెప్పారు. ఉయ్యాల శంకర్ కంపోజ్ చేసిన ఫైట్లు, చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవగానే సినిమాను విడుదల చేస్తామన్నారు. ఎన్‌వీఆర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏలేంద‌ర్ మ‌హావీర్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు శ్రీకర్ రెడ్డి, సంగ కుమారస్వామి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

అవునూ.. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని