Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సీక్వెల్పై స్పందించిన అనిల్ రావిపూడి.. ఆయన ఏమన్నారంటే?
దసరా కానుకగా కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘భగవంత్ కేసరి’ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది.
ఇంటర్నెట్ డెస్క్: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్ (kajal), శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు (Dil Raju), దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తనతో కలిసి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీసే ధైర్యం తనకు లేదన్నారు. ఈ బరువు మోసినందుకే చాలా నలిగిపోయానని, సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే వెంటనే తీస్తానని చెప్పారు.
శ్రీలీల వారిని గుర్తుచేసింది: దిల్ రాజు
‘‘మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ రావిపూడి ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. ‘భగవంత్ కేసరి’ గురించి నాకు ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ మాండలికంలో బాలకృష్ణ సంభాషణలు చెబితే చాలా కొత్తగా ఉంటుందన్నా. ముందు నుంచీ ‘బ్రో ఐ డోంట్ కేర్’ని టైటిల్ అనుకుని తర్వాత ‘భగవంత్ కేసరి’గా మార్చాడు. ఎక్కువగా ఎంటర్టైనింగ్ సినిమాలు తీసే అనిల్ ఇలాంటి బలమైన కథను రాయడం గొప్ప విషయం. నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్ అనేవారు. కానీ, ఇందులోని ఆమె నటన జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. బాలకృష్ణ డెడికేషన్తో నటించారు. ఇది లాంగ్రన్ ఫిల్మ్’’ అని దిల్ రాజు అన్నారు.
అనిల్, బాలకృష్ణకు హ్యాట్సాఫ్: నందిని రెడ్డి
‘‘నేను, అనిల్ రావిపూడి బాలకృష్ణకు అభిమానులం. ఆయన సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షోలో మేం కలుసుకునే వాళ్లం. బాలకృష్ణతో ఎప్పుడు సినిమా తీస్తావ్ అని అడిగితే.. ‘నేనెప్పుడు చేసినా అది మీరంతా కాలర్ ఎగరేసేలా ఉంటుంది’ అని అనిల్ సమాధానమిచ్చేవాడు. ఇప్పుడదే పని చేస్తున్నా. గొప్ప సందేశం ఉన్న ఇలాంటి కథను తెరకెక్కించినందుకు అనిల్కు, నటించినందుకు బాలకృష్ణకు హ్యాట్సాఫ్’’ అని దర్శకురాలు నందిని రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM