Bhagavanth Kesari: దసరాకి ముందు డబుల్ ధమాకా ఇస్తున్నాం!
‘‘పన్నుల రూపంలో ఆదాయాన్నిచ్చే సినీ రంగాన్ని ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో ఓ భాగంగా గుర్తించాలి’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హనుమకొండలో జరిగింది.
- ‘భగవంత్ కేసరి’ వేడుకలో బాలకృష్ణ
‘‘పన్నుల రూపంలో ఆదాయాన్నిచ్చే సినీ రంగాన్ని ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో ఓ భాగంగా గుర్తించాలి’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హనుమకొండలో జరిగింది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించారు. షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. యువ దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ని విడుదల చేశారు. ‘ఎవడ్రా దేవుడు... బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆవిడే వంద దేవుళ్ల లెక్క’ అంటూ ట్రైలర్లో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. వేడుకలో కాజల్, శ్రీలీల కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆడిపాడటం ఆకట్టుకుంది.
- బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకోసం తొలిసారి తెలంగాణ మాండలికంలో సంభాషణలు చెప్పా. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా కథ నడుస్తుంది. ఎప్పుడూ కొత్తదనాన్ని అందించాలనే తాపత్రయం నాన్న దగ్గరి నుంచి వంశపారంపర్యంగా వస్తోంది. ‘అఖండ’ తర్వాత ఇకపై ఏం చేస్తాడనుకున్న తరుణంలో ‘వీరసింహారెడ్డి’ చేశా. అదీ రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఏమిటి అనుకున్న సమయంలో సరైన సినిమా దొరికింది. అనిల్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడం నాకు బాగా నచ్చింది. ఇందులో ఆశ్చర్యరకమైన విషయాలు చాలా ఉన్నాయి. దసరాకి ముందు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం. అది ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుంది. కథలో ఎంతో సీరియస్ విషయాన్ని స్పృశించినా మధ్యలో నా శైలి కామెడీ ఉంటుంది. అందం, నటనా ప్రతిభ ఉన్న కాజల్తో నటించాలని ఎదురు చూసేవాణ్ని. ఆ అవకాశం ఈ సినిమాతో కుదిరింది. శ్రీలీల గర్వించదగిన నటి. ఎన్నో రకాల సినిమాలు చేస్తూ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర పోషించింది. నాకూ అర్జున్ రాంపాల్కీ మధ్య మంచి సన్నివేశాలున్నాయి. ‘రాజు తన వెనకున్న వందల మంది మందని చూస్తాడు. కానీ మొరటోడు వాడికున్న ఒకే ఒక గుండెని చూస్తాడు’ అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంటుంది. అవన్నీ వింటే పండగే. సెంటిమెంట్స్, డైలాగులు, పాటలు, ఫైట్లు అన్నీ ఉంటాయి’’ అన్నారు.
- కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. స్ఫూర్తిదాయకమైన బాలకృష్ణతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవం. అనిల్ రావిపూడితో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. శ్రీలీల ఎంతో ప్రతిభావంతురాలు’’ అన్నారు.
- ‘‘ఈ సినిమాలో నేను వరంగల్ అమ్మాయిగా కనిపిస్తా. ఈ అందమైన కథలో నేను విజ్జి పాప పాత్ర చేశా. అందుకే ఆ పాత్రలాగే ఈ వేడుకకి వచ్చా. ఈ పాత్రని తీర్చిదిద్దిన దర్శకులు అనిల్కి కృతజ్ఞతలు. మనసుల్ని తాకే పాత్ర ప్రతి సినిమాలో దొరకదు. అలాంటి అందమైన పాత్రని ఇందులో చేశా. నా జీవితంలో ఏ అనుభవాలైతే లేవో, అది ఈ సినిమాతో ఇచ్చారు.ఈ సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు శ్రీలీల.
- దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘‘అనిల్ తర్వాత నేను బాలకృష్ణ సర్తో సినిమా చేయబోతున్నా. అది కూడా చాలా ఏళ్లు గుర్తుంటుంది. ‘భగవంత్ కేసరి’ అనిల్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. గ్లామర్, పరిణతి కనబరుస్తూ నటిస్తున్నారు కాజల్. శ్రీలీల పేరు వినబడుతూనే ఉంది. నిర్మాతలు, చిత్రబృందానికి నా అభినందనలు’’ అన్నారు.
- గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘అనిల్ ఇప్పటిదాకా చేసిన సినిమాలు వేరు, ఇది వేరు. బాలయ్య బాబు చాలా కొత్తగా ఉన్నారు. ఒక అభిమానిగా తీశాడు అనిల్. ట్రైలర్ చాలా బాగుంది’’ అన్నారు.
- అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘మేకింగ్ పరంగానూ, బడ్జెట్ పరంగా ఎంతో స్వేచ్ఛనిచ్చారు నిర్మాతలు. ఆ ఫలితం ఎలా ఉంటుందో చూస్తారు. కాజల్తో తొలిసారి కలిసి పనిచేశా. ఇందులో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాకి ఆయన తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారు. భగవంత్ కేసరి, విజ్జిపాప మధ్య భావోద్వేగ ప్రయాణం చాలా బాగుంటుంది. శ్రీలీల విజ్జిపాపగా చాలా బాగా నటించారు. బాలయ్య బాబు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. కొత్త పాత్ర ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఓ స్టూడెంట్లాగా నేనేం చేయాలని తపిస్తూ పనిచేస్తుంటారు. నేను రాసిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ కష్టపడ్డారు. బాలయ్యబాబుతో ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్, వెంకట్, తమ్మిరాజు, కాసర్ల శ్యామ్, జాన్ విజయ్, మురళీధర్, శ్రవణ్, జయరాం, చిట్టి, ఆనంద్రాజ్, బేబి నైనిక తదితరులు పాల్గొన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘తెలంగాణలో దసరా కంటే పెద్ద పండగ లేదు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో ఈ పండగని అందరూ ఆస్వాదిస్తారు. కాజల్, శ్రీలీల బతుకమ్మ ఆడుతుంటే చూడ్డానికి ముచ్చటగా అనిపించింది. ప్రతి అమ్మాయి శ్రీలీల పాత్రలో తమని తాము చూసుకుంటారు. ‘బృందావనం’ నుంచి కాజల్తో అనుబంధం ఏర్పడింది. నందమూరి బాలకృష్ణ సినిమాల గురించి చెప్పడానికి సరిపోను. నటుడిగానే కాదు, బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో సేవలు చూసి బాలకృష్ణ సర్ జన్మ ధన్యమైందనిపించింది’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rashi Singh: అందాల రాశి
ఇటీవల ఓ సినిమాతో సందడి చేసిన రాశీసింగ్ ఇప్పుడు ‘ప్రసన్నవదనం’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విశేషాలు..
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్సిరీస్ మెప్పించిందా? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!