Bheemla nayak: చాలా ప్రయోగాలు చేశాం
‘‘ధృతరాష్ట్రుడిలా కౌగిలించుకుని వదిలిపెట్టకపోవడం అనేది గొప్ప కథ లక్షణం. ‘అయ్యప్పానుమ్ కోషియుమ్’ అలాంటి కథే. కాబట్టి ఆ మాతృక ప్రేమ నుంచి బయటకొచ్చి ‘భీమ్లానాయక్’ను చేయడానికి చాలా ప్రయోగాలు చేశామ’’న్నారు దర్శకుడు త్రివిక్రమ్. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రమిది.
త్రివిక్రమ్
‘‘ధృతరాష్ట్రుడిలా కౌగిలించుకుని వదిలిపెట్టకపోవడం అనేది గొప్ప కథ లక్షణం. ‘అయ్యప్పానుమ్ కోషియుమ్’ అలాంటి కథే. కాబట్టి ఆ మాతృక ప్రేమ నుంచి బయటకొచ్చి ‘భీమ్లానాయక్’ను చేయడానికి చాలా ప్రయోగాలు చేశామ’’న్నారు దర్శకుడు త్రివిక్రమ్. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రమిది. సాగర్ కె.చంద్ర తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రానా మరో హీరో. నిత్యామేనన్, సంయుక్తా మేనన్ కథానాయికలు. త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పారు. దాన్ని భీమ్లానాయక్ కోణం నుంచి ఎలా చెప్పాలన్నదే.. మాకెదురైన తొలి సవాల్. అడవికి సెల్యూట్ చేస్తూ భీమ్లా పాత్రను పరిచయం చేస్తే సరైన జస్టిఫికేషన్ దొరుకుతుందనిపించింది. పవన్ కల్యాణ్ లాంటి స్టార్తో సినిమా అంటే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన్ని ఎలివేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు కృత్రిమంగా ఉండకూడదు. అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలు మిస్ కాకుండా ఉండాలి. అవన్నీ బ్యాలెన్స్ చేయడానికే మేం ఎక్కువ కష్టపడ్డాం. అభిమానులు మెచ్చేలా పవన్ని తెరపై చూపించడానికి సాగర్ బాగా శ్రమించారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ పవన్, రానా ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పని చేశారు. సినిమాకి మంచి టీమ్ కుదిరింది. చిన్న చిన్న పాత్రలకీ పేరొచ్చింది. ఇప్పటితరం నటులకు సినిమాపై ఉన్న ప్రేమ, ప్రతి విషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. ఐదేళ్లుగా నేనీ విషయాన్ని గమనిస్తున్నా. సాగర్ ఆలోచనతోనే టైటిల్ పాటను మొగిలయ్యతో పాడించాం. ఆయనకు పద్మశ్రీ రావడం ఎంతో ఆనందం కలిగించింది. తమన్ ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు. అందుకే అంత గొప్పగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పుడుతోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం తొలిసారి త్రివిక్రమ్ని కలిసినప్పుడు ‘ఇది రీమేక్ అనే విషయం మర్చిపోయి.. మన చిత్ర రీమేక్ రైట్స్ వేరే వాళ్లు కొనాలి అనేట్లు చేద్దాం సాగర్’ అన్నారు. ఈ సినిమా విషయంలో ఆయన హారానికి దారంలా పనిచేశారు. కథను అర్థం చేసుకుని.. దానికి తగ్గ సంగీతాన్ని అందించారు తమన్. ఈ చిత్ర సక్సెస్ రీ సౌండ్కు కారణం త్రివిక్రమ్ ఆలోచనే. వసూళ్లు చూశాక చాలా ఆనందంగా ఉంద’’న్నారు దర్శకుడు సాగర్ కె.చంద్ర. తమన్ మాట్లాడుతూ.. ‘‘పవన్ - త్రివిక్రమ్ల కలయికలో పని చేయాలన్నది నా కల. అదింత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. ఈ సినిమా ఓ కార్చిచ్చు లాంటిది. ఈ మంటని ఆపడం చాలా కష్టం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, సంయుక్త మేనన్, గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, నటి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rashi Singh: అందాల రాశి
ఇటీవల ఓ సినిమాతో సందడి చేసిన రాశీసింగ్ ఇప్పుడు ‘ప్రసన్నవదనం’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విశేషాలు..
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్సిరీస్ మెప్పించిందా? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!