Bholaa Shankar: థియేటర్లలో కలుద్దాం.. ఆసక్తికర అప్‌డేట్‌ పంచుకున్న చిత్ర బృందం

చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌, సుశాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated : 07 Jul 2023 05:45 IST

చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar). రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌, సుశాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణాంతర పనుల్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు డబ్బింగ్‌ స్టూడియోలో దిగిన కొన్ని ఫొటోల్ని పంచుకున్నారు. ‘‘సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ కచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. థియేటర్లలో కలుద్దాం’’ అంటూ ఆ ఫొటోలకు ఓ వ్యాఖ్యను జోడించారు చిరు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వర సాగర్‌, ఛాయాగ్రహణం: డడ్లీ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని