NTR : గత వారం అక్కడే ఉన్నాను.. జపాన్‌ భూకంపంపై ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి

జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Updated : 02 Jan 2024 12:54 IST

హైదరాబాద్: జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై నటుడు ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వారం తారక్‌ వ్యక్తిగత పర్యటన నిమిత్తం జపాన్‌లోనే ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ‘‘గత వారతమంతా అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో  ప్రజలు త్వరగా కోలుకోవాలి’’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

జపాన్‌లో సోమవారం దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ ఘటనలో 20 మందికిపైగా మృతి చెందినట్లు.. పలువురు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా సంభవించిన ఈ భూకంపాలతో తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలంతా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ తరువాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని