#DNS: నాగ్‌.. ధనుష్‌ల చిత్రం ప్రారంభం

ధనుష్‌, నాగార్జున కథానాయకులుగా.. శేఖర్‌ కమ్ముల  దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక కథానాయిక.

Updated : 19 Jan 2024 09:36 IST

ధనుష్‌, నాగార్జున కథానాయకులుగా.. శేఖర్‌ కమ్ముల  దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక కథానాయిక. అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ సమర్పకులు. గురువారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ధనుష్‌పై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘ధనుష్‌, నాగార్జున.. ఈ ఇద్దరి స్టార్‌లను తెరపై చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘ఫిదా’, ‘లవ్‌స్టోరి’ చిత్రాల తర్వాత శేఖర్‌ కమ్ముల ఓ విభిన్నమైన కథతో దీన్ని తెరకెక్కిస్తున్నార’’ని సినీవర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని