Rohit Shetty: ‘సర్కస్‌’ వారి కోసమే చేశా: దర్శకుడు రోహిత్‌శెట్టి

‘సర్కస్‌’ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి. ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామన్నారు.

Published : 25 Jan 2024 23:35 IST

ముంబయి: కరోనా సమయంలో సినీ కార్మికులు, తన బృందానికి ఉపాధి కల్పించడానికే ‘సర్కస్‌’ (Cirkus) చేశానని బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి (Rohit Shetty) తెలిపారు. ఒకవేళ ఇప్పుడు ఆ సినిమా చేయాల్సి వస్తే చేయనన్నారు. ‘‘కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎటువంటి యాక్షన్‌ సన్నివేశాలుండవు కాబట్టి ఈ సినిమా చేస్తే చాలా మందికి పని దొరుకుతుందనే ఆలోచనతో తెరకెక్కించా. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత చేసిన మొదటి సినిమా ఇది. కొవిడ్‌ పరీక్షలు చేయించడం.. పాజిటివ్‌ వచ్చిన వారిని సెట్స్‌కు దూరంగా ఉంచడంతో సినిమా చిత్రీకరణ చాలా కష్టంగా మారింది ’’అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

రివ్యూ: ఫైట‌ర్‌.. హృతిక్‌ యాక్షన్ మూవీ మెప్పించిందా?

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా తెరకెక్కిన ‘సర్కస్‌’ భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయాన్ని అందుకుంది. పూజా హెగ్డే  కథానాయిక. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె ప్రత్యేక గీతంలో నటించారు. రోహిత్‌ తెరకెక్కించిన ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ వెబ్‌సిరీస్‌ ఇటీవల ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదలైంది. ప్రస్తుతం.. ‘సింగం ఎగైన్‌’తో బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు