Virata Parvam: పాత్ర కోసం సాయి పల్లవి ఆహారం తీసుకోలేదు: వేణు ఊడుగుల
రానా, సాయి పల్లవి, ప్రియమణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు వేణు ఊడుగుల. ‘వాస్తవ ఘటనలే నా కథా వస్తువులు’ అని చెప్తుండే ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ‘విరాటపర్వం’ (Viarataparvam). రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా వేణు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. సినిమా గురించి, నాయకానాయికల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. వాటిల్లోని కొన్ని సంగతులివీ..
* విరాటపర్వం ఎలా ఉండబోతుంది?
వేణు: 90ల నాటి కథ ఇది. గాఢమైన ప్రేమ, రాజకీయ నేపథ్యంలో సాగుతుంది. మనకు బాగా కావాల్సిన వారు చనిపోతే ఎలాంటి బాధ ఉంటుందో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అదే భావోద్వేగానికి లోనవుతారు. ఈ సినిమాలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
* ఈ సినిమాలో నక్సలిజాన్ని చూపించినట్టున్నారు? మీ తొలి చిత్రంలోనూ సామాజికాంశాలను ప్రస్తావించారు?
వేణు: అలాంటి సమాజంలోనే నేను పుట్టి, పెరిగా. మాది వరంగల్. అక్కడి సమస్యలు, విప్లవాలు నాకో భిన్నమైన దారిని చూపాయి. దీంతోపాటు నేను చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తుల ప్రభావమూ సినిమాపై పడుండొచ్చు.
* ఈ సినిమా కోసం నక్సలైట్ల గురించి రీసెర్చ్ చేశారా?
వేణు: లేదు. ఇంతకు ముందు చెప్పినట్టు, నక్సల్స్ జీవితాలు ఎలా ఉంటాయో బాల్యం నుంచే నాకు అనుభవం ఉంది. మా ఇంట్లో నుంచి చూస్తుంటే నక్సల్స్, పోలీసుల ఎన్కౌంటర్లు కనిపిస్తుండేవి. వాటికి నేను పత్యక్ష సాక్షిని. అందుకే ఈ కథ కోసం ఎలాంటి రీసెర్చ్ చేయలేదు.
* ఎవరిని దృష్టిలో పెట్టుకుని రానా పాత్రను సృష్టించారు?
వేణు: నిజామాబాద్కు చెందిన శంకరన్న అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని రానా పాత్రను రాశా. పాత్ర పేరు ‘రవన్న’ అని పెట్టా.
* ఈ క్యారెక్టర్కు రానానే తీసుకోవడానికి కారణమేంటి? ఇంకా ఎవరినైనా సంప్రదించారా?
వేణు: ఈ పాత్ర కోసం ముందుగా రానానే కలిశా. మరెవరికీ ఈ స్క్రిప్టు వినిపించలేదు. సామాజిక స్పృహ, వాస్తవికతను తెరపైకి తీసుకురావాలనే ఆకాంక్ష.. తదితర లక్షణాలున్న నటుడు రానా. ఇలాంటి పవర్ఫుల్ పాత్రకు ఆయన న్యాయం చేయగలరనే నమ్మకం ముందు నుంచీ ఉంది. నేను అనుకున్నదాని కంటే మంచి ఔట్పుట్ ఇచ్చారాయన.
* సాయిపల్లవి గురించి..
వేణు: లుక్స్, నటన పరంగా పాత్రలో ఒదిగిపోయింది. ఆమె అసాధారణ నటి. అంకిత భావంతో పనిచేస్తుంది. పాత్రకు తగ్గ అవతారంలోకి మారేందుకు ఓ రోజు ఆహారం కూడా తీసుకోలేదామె. ఈ చిత్రంలో ఆమె వెన్నెల అనే క్యారెక్టర్లో కనిపిస్తుంది.
* ఈ సినిమా ఇతర భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారా?
వేణు: ప్రస్తుతానికి తెలుగు, మలయాళం, తమిళంలోనే విడుదల చేయాలనుకుంటున్నాం. హిందీ గురించి ఇంకా ఆలోచించలేదు.
* మీపై ఏ దర్శకుడి ప్రభావం ఉంటుంది?
వేణు: ప్రభావం అనికాదు గానీ కె. బాలచందర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతా.
* తదుపరి చిత్రాలేంటి?
వేణు: ఇప్పటికైతే ఏం ఖరారు కాలేదు. పెద్ద హీరోల నుంచి ‘ఓకే’ అనే మాట వినిపిస్తే నిర్మాణ సంస్థలే వాటిని ప్రకటిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం