EMK: సమంత రూ.25లక్షలు గెలుచుకుందిలా.. కాళ్లకు దండం పెట్టొద్దన్న ఎన్టీఆర్‌!

ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న కార్యక్రమం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’(Evaru Meelo Koteeswarulu). ఇటీవల

Updated : 11 Jul 2023 17:16 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న కార్యక్రమం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’(Evaru Meelo Koteeswarulu). ఇటీవల దసరా సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి అగ్ర కథానాయిక సమంత వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా ‘చాంప్స్‌ ఎలీసే మార్గంలో నడిచి, ఏ నగరంలో ఆర్క్‌ డి ట్రియోంఫ్‌ని చూడవచ్చు’ అన్న ప్రశ్నకు సమంత సరైన సమాధానం గుర్తించలేకపోయారు. దీంతో 50:50 ఆప్షన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ‘పారిస్‌’ ఆప్షన్‌ నుంచి ఎంచుకోగా, వేదిక మొత్తం నిశ్శబ్దమైపోయింది. సమంత తెగ టెన్షన్‌ పడిపోగా, ఆమెను ఎన్టీఆర్‌ కాసేపు ఆటపట్టించారు. ‘పారిస్‌ వెళ్తే ఎంతసేపూ షాపింగ్‌ చేసుకుంటూ, ఐఫిల్‌ టవర్‌ చూసేసి, బాగా బ్యాగులు కొని వచ్చేసుంటారు’ అని అనేసరికి సమంత నవ్వేసింది. ‘పారిస్‌’ సరైన జవాబు అని చెప్పడంతో ఆనందపడిపోయింది.

ఇక రూ.25లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పి, తెగ ఆనందపడిపోయారు సమంత. ‘నేను జీనియస్‌. మా అమ్మ ఎప్పుడూ నాకు చెప్పేది. కానీ, నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు నమ్ముతున్నా’ అని చెప్పుకొచ్చింది. ‘నువ్వు జీనియస్‌ అని, మీ అమ్మగారు చూశారు. నేను నిరూపించా. నీకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా నా కాళ్లకు నమస్కారం పెట్టడం. నా ఫొటో ఇంట్లో పెట్టుకుని పూజలు చేయటం చేయొద్దు’ అని ఎన్టీఆర్‌ చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని