Faria: ఆ రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి!
‘జాతి రత్నాలు’ చూసినవాళ్లంతా ఆ సినిమాలో రత్నాలు ముగ్గురు కాదు, నలుగురు అని తేల్చిచెప్పారు. ఆ నాలుగో రత్నం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.
‘జాతి రత్నాలు’ చూసినవాళ్లంతా ఆ సినిమాలో రత్నాలు ముగ్గురు కాదు, నలుగురు అని తేల్చిచెప్పారు. ఆ నాలుగో రత్నం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. కొందరైతే ఈ ‘చిట్టి’ రువ్విన చిరునవ్వుల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. సినిమాలకు కొత్త కావొచ్చుకానీ, నటనలో మాత్రం సుదీర్ఘ అనుభవం ఉందంటున్న ఈ హైదరాబాదీ ఇంకా ఏం చెబుతోందంటే...
నాటకరంగం నుంచి...
స్కూల్ రోజుల్లో ఏటా సమ్మర్ క్యాంపులకు హాజరవుతూ యాక్టింగ్, పెయింటింగ్, డ్యాన్స్లాంటివి నేర్చుకునేదాన్ని. టెన్త్ తర్వాత ఇంటర్మీడియెట్కి కాలేజీలో చేరలేదు. హోమ్ స్కూలింగ్ పద్ధతిలో చదువుకున్నా. ఆ సమయంలో పెయింటింగ్ క్లాసులకి కాచీగూడ, సాహిత్యం క్లాసులకు లింగంపల్లి వెళ్లేదాన్ని. తర్వాత నాటకరంగంపైన ఆసక్తి కలిగింది. ఏడేళ్లుగా నగరంలోని వివిధ నాటక సంస్థల్లో భాగమై ఎన్నో పాత్రలు పోషించాను. కొన్ని నాటకాలు రాయడంతోపాటు దర్శకత్వం వహించాను కూడా.
అలా వచ్చింది ఛాన్స్...
లయోలా కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తిచేశా. తర్వాత కొన్నాళ్లకు ఓ కార్యక్రమం కోసం నాగ్ అశ్విన్ లయోలా కాలేజీకి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసి వెళ్లి కలిశా. ఓ ప్రాజెక్టు చేస్తున్నాం, ఆసక్తి ఉంటే ఆఫీసులో కలవమని చెప్పారు. వెళ్లాక ఆడిషన్ చేసి ఎంపికచేశారు. నాటకరంగంలో ఏడేళ్ల అనుభవం ఉంది. షార్ట్ఫిల్మ్స్, వెబ్సిరీస్లలో నటించాను. ఆ అనుభవం నాకు బాగా పనికొచ్చింది. స్టేజీమీద ప్రదర్శన ఇవ్వడంవల్ల ఏకాగ్రత బాగా అలవడుతుంది. అది నటనకు చాలా అవసరం.
డాన్స్ అంటే ఇష్టం...
ఇంట్లో అందరికీ కళలంటే ఇష్టం. ప్రత్యేకించి నటన, డాన్స్ అంటే ప్రత్యేక ఆసక్తి. అయితే వాళ్లలో ఎవరూ బయటకు వచ్చి ప్రదర్శనలు ఇవ్వలేదు, సినిమాల్లో నటించలేదు. నేను కడుపులో ఉన్నపుడు అమ్మ డాన్స్ ప్రాక్టీసు చేసేదట. అప్పుడే నాక్కూడా డాన్స్పైన ఆసక్తి ఏర్పడిందేమో. జాతి రత్నాల్లో హీరో నాకు డాన్స్ నేర్పుతాడు. కానీ నిజ జీవితంలో నేను డాన్సర్ని. హిప్ హాప్, బెల్లీ డాన్స్, ఫ్రీ స్టయిల్ డాన్సింగ్ లాంటి పాశ్చాత్య నృత్యాలతోపాటు కథక్ కూడా నేర్చుకున్నా. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, కవిత్వం కూడా ఇష్టం.
ఓటీటీకి ఓటేశా కానీ!
జాతిరత్నాలుకు సంబంధించిన షూటింగ్ 95శాతం 2019లోనే పూర్తయిపోయింది. తర్వాత కరోనా, లాక్డౌన్ కారణంగా థియేటర్ రిలీజ్ ఆలస్యమైంది. ఆ సమయంలో ‘ఓటీటీలో రిలీజ్ చేయడంపైన మీ అభిప్రాయం ఏంట’ని టీమ్ అందరినీ అడిగారు నిర్మాత నాగ్ అశ్విన్. అప్పటికే ఆ సినిమా గురించి చాలా రోజులుగా వేచి చూడ్డంవల్ల ఓటీటీకే ఓటు వేశాను. కానీ మెజారిటీ అభిప్రాయం మేరకు థియేటర్ రిలీజ్ కోసం ఆగారు. సినిమా చూసినంతసేపూ కడుపుబ్బా నవ్వుతారని తెలుసు కానీ ఈ స్థాయిలో ప్రేక్షకులు స్పందిస్తారని ఊహించలేదు. థియేటర్లో ఈలలూ, అరుపులూ బయట ప్రశంసలూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
తెలుగు నేర్చుకున్నా...
జాతిరత్నాలు షూటింగ్ సమయం ఎంతో సరదాగా గడిచిపోయేది. నవీన్, ప్రియదర్శి, రాహుల్, దర్శకుడు అనుదీప్... ఇలా టీమ్లో అందరూ జోవియల్గా ఉండేవారు. ఆ వైబ్ ఎంతో నచ్చింది. ఇంట్లో హిందీ, ఉర్దూ మాట్లాడుతుంటాం. ఎప్పట్నుంచో తెలుగు నేర్చుకోవాలని అనుకునేదాన్ని. ఈ సినిమావల్ల ఆ అవకాశం వచ్చింది. డబ్బింగ్ కూడా నేనే చెప్పా.
డైరెక్షన్ చేస్తా...
తెలుగులో ఇప్పటికే కొత్త సినిమా కథలు వింటున్నా. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది నా ఉద్దేశం. తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధం. సినిమా అనే కాదు, ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చేస్తా. నాకు నచ్చిన పాత్రలు రాకుంటే, ఇష్టమైన రంగాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో వేటినైనా ఎంచుకుంటా. సినిమాల్లోనే ఉంటే ఏదో ఒకరోజు డైరెక్షన్ చేస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు