ఇప్పుడు విద్యుల్లేఖను చూస్తే షాక్‌ అవుతారు

సహ నటి విద్యుల్లేఖరామన్‌ తాజా ఫొటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ‘రన్‌ రాజా రన్‌’, ‘రాజుగారి గది’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘దువ్వాడ జగన్నాథమ్‌’,

Updated : 14 Mar 2021 16:24 IST

సోషల్‌ మీడియాలో భావోద్వేగపు పోస్ట్‌ చేసిన నటి

హైదరాబాద్‌: సహ నటి విద్యుల్లేఖ రామన్‌ తాజా ఫొటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ‘రన్‌ రాజా రన్‌’, ‘రాజుగారి గది’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘దువ్వాడ జగన్నాథమ్‌’, ‘నిన్నుకోరి’, ‘ఆనందో బ్రహ్మ’, ‘భాగమతి’.. ఇలా అనేక చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఈ క్రమంలో తన బరువు విషయంలో విమర్శలు వచ్చాయని, అవెంతో బాధించాయని గతంలో ఆమె ఆవేదన చెందారు. కాగా లాక్‌డౌన్‌లో అంకితభావంతో కసరత్తులు చేసి బరువు తగ్గారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె శరీరంలో మార్పు చూసి అందరూ షాక్‌ అయ్యారు. ఈ ఫొటో వైరల్‌ అయ్యింది.

‘‘ఫేక్‌ నమ్మకానికి.. నిజమైన నమ్మకానికి చాలా తేడా ఉంది. నేను అధిక బరువు ఉన్నప్పుడు ‘నువ్వు ఎలా ఇంత ఆత్మస్థైర్యంతో ఉండగలుగుతున్నావు?’ అని నన్ను చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు నిజంగా నాలో విశ్వాసం పెరిగింది. ఎందుకంటే.. నేను సాధించలేను అనుకున్నది.. సాధించా. నా లైఫ్‌స్టైల్‌ను, అలవాట్లను మార్చుకున్నా. మనసుపెడితే ఏదైనా సాధ్యమేనని అర్థం చేసుకున్నా.. ఇది నిజం.’’

‘‘జీవితంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. వారంలో ఆరు రోజులు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సరైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఎటువంటి రహస్యాలు, మందులు అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన శ్రమ చాలు.. మన కన్నీరు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. 2020 జూన్‌ 20 నాటికి నా బరువు 68.2 కిలోలు..’’ అని విద్యుల్లేఖ భావోద్వేగంతో వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని