Cobra: ‘కోబ్రా’ వచ్చేది ఆరోజే
విక్రమ్ హీరోగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం
విక్రమ్ హీరోగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ పంచుకుంది. సినిమాలో ఆయన దాదాపు 25 గెటప్పుల్లో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు. దీనికి ఏఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. హరీశ్ కణ్ణన్ ఛాయాగ్రహణం అందించారు.
కార్తికేయన్.. ‘మావీరన్’
వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. ఇటీవలే ‘డాన్’గా ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ప్రస్తుతం కె.వి.అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే శివ కార్తికేయన్, కమల్హాసన్ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించనున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాకి ‘మావీరన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కార్తికేయన్ శక్తిమంతమైన ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పూర్వ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సాయిపల్లవి నాయిక.
థ్రిల్లింగ్ ప్రయాణం
నిఖిల్ కుమార్, షిఫా జంటగా మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన చిత్రం ‘కరణ్ అర్జున్’. సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ బోర్డర్లో చిత్రీకరణ జరిపారు. ట్రైలర్ లాగే సినిమా బాగుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు. ఈ సినిమాకి సంగీతం: రోషన్ సాలూరి, ఛాయాగ్రహణం: మురళికృష్ణ వర్మన్.
వినూత్నమైన ప్రేమకథతో..
అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే జంటగా నటించిన చిత్రం ‘ఓ మై లవ్’. స్మైల్ శ్రీను దర్శకుడు. జి.రామాంజని నిర్మించారు. ఈ సినిమా త్వరలో తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్ను దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇటీవల హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీజర్ చూస్తే.. అందమైన ప్రేమకథతో సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. నిర్మాతకు మంచి లాభాలు దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సంగీతం: చరణ్ అర్జున్, ఫైట్స్: రియల్ సతీష్.
‘రుద్ర సింహ’.. ప్రతీకార కథ
సంతోష్, స్నేహ, మైత్రి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రుద్ర సింహ’. మనోహర్ కాటేపోగు దర్శకుడు. ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్రావు జింకల, మనోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార కథతో రూపొందుతోన్న యాక్షన్ చిత్రమిది. ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయ’’న్నారు. సంగీతం: టి.రాజేష్ రాజ్, ఛాయాగ్రహణం: జి.ఉదయ్ కుమార్.
వెంటపడే ఆ చిన్నాడెవడు?
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఒక అమ్మాయికి తెలియకుండా ఓ అబ్బాయి వెంటపడుతుంటాడు. ఆ విషయం ఆమెకి తప్ప ఊర్లో ఉన్న వాళ్లందరికీ తెలుస్తుంది. దాని వల్ల ఆ అమ్మాయికి వచ్చే సమస్యలేంటి? ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఎలా కలిసింది? అన్నది మిగతా చిత్ర కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. వెంకట్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. సందీప్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య