టిఫ్‌ చర్చలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి

ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టిఫ్‌ - 2022)లో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి భాగం కానున్నారు. హాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి చర్చావేదికలో పాల్గొననున్నారు.

Published : 11 Aug 2022 02:23 IST

ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టిఫ్‌ - 2022)లో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి భాగం కానున్నారు. హాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి చర్చావేదికలో పాల్గొననున్నారు. ఆ విషయాన్ని టిఫ్‌ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 8 నుంచి 18 వరకు ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించారు రాజమౌళి. ప్రస్తుతం మహేష్‌బాబుతో తీయనున్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని