Trisha: త్రిష విషయంలో ఆ ప్రచారమే నిజమైంది

‘2018’ భారీ విజయం తర్వాత దేశం దృష్టిని ఆకర్షించిన నటుడు టొవినో థామస్‌. తను నటిస్తున్న తదుపరి చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌లు దర్శకులు.

Updated : 10 Jul 2023 07:42 IST

‘2018’ భారీ విజయం తర్వాత దేశం దృష్టిని ఆకర్షించిన నటుడు టొవినో థామస్‌. తను నటిస్తున్న తదుపరి చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌లు దర్శకులు. ఇందులో అగ్ర తార త్రిష కృష్ణన్‌ లీడింగ్‌ లేడీగా నటిస్తుండగా.. టొవినో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇందులో త్రిష నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిని నిజం చేస్తూ త్రిష తమ సినిమాలో భాగం అవుతున్న విషయాన్ని టొవినో తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘త్రిష కృష్ణన్‌ మా సినిమాలో ప్రధాన పాత్రధారిగా కనిపించనున్నారు. ఆమెతో కలిసి పని చేస్తుండడం చాలా ఉత్సుకతగా ఉంది. త్వరలోనే మర్చిపోలేని సినిమా ప్రయాణం మొదలవుతుంది’ అని థామస్‌ తెలిపాడు.. బహుళ భాషల్లో, యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రం సెప్టెంబరులో చిత్రీకరణ మొదలు కానుంది. రాజు మల్యత్‌ నిర్మాత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని