రూల్స్ రంజన్ రాకకు వేళాయే..
‘సలార్’ వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరున బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు పలు చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలు వరుస కడుతున్నాయి.
‘సలార్’ వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరున బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు పలు చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలు వరుస కడుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం నుంచి వస్తున్న ‘మ్యాడ్’ ఈనెల 28న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. సోమవారం మరో రెండు చిత్రాలు విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి.
విడుదల కబుర్లు
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రత్నం కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి సంయుక్తంగా నిర్మించారు. నేహా శెట్టి కథానాయిక. ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. సినిమాని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ‘ఇంట్రడక్షన్ ఆఫ్ రూల్స్ రంజన్’ పేరుతో హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘‘ఏడాది క్రితం ఈ సినిమాతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఏఎం రత్నం ద్వారా కృష్ణను కలిసి ఈ కథ విన్నా. ఇది వింటున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. రేపు థియేటర్లలో చూసేటప్పుడు ప్రేక్షకులూ అదే అనుభూతి చెందుతారనే నమ్మకం ఉంది. దీంట్లో నేను మనోరంజన్ అనే పాత్ర పోషించాను. మనలో ఒకడిలా ఉండే ఆ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు. ‘‘డీజే టిల్లు’లో రాధిక పాత్ర తర్వాత ఈ సినిమాలో నేను పోషించిన సనా పాత్ర ప్రేక్షకుల్ని మళ్లీ అంతలా మెప్పిస్తుందని నమ్ముతున్నా. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంది నాయిక నేహా. ‘‘సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి అమ్రిష్ అద్భుతమైన సంగీతమందించారు. కుటుంబసమేతంగా చూడదగ్గ ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు నిర్మాత. ‘‘నా గత చిత్రం ‘ఆక్సీజన్’కు ఆశించిన ఆదరణ లభించలేదు. దీంతో మంచి వినోదాత్మక చిత్రం చేయాలనుకున్నా. ఆ ప్రయత్నంలో చేసిందే ఈ ‘రూల్స్ రంజన్’. కుటుంబసమేతంగా థియేటర్లకు వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిది’’ అన్నారు దర్శకుడు రత్నం కృష్ణ. ఈ కార్యక్రమంలో దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, అమ్రిష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఎం రత్నం ‘హరి హర వీరమల్లు’ సినిమా గురించి స్పందిస్తూ.. ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.
పెదకాపు వస్తున్నాడు
‘నారప్ప’ విజయం తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘పెదకాపు-1’. విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగతి శ్రీవాత్సవ కథానాయిక. రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో విరాట్ వేట కొడవలి పట్టుకొని సీరియస్గా చూస్తూ కనిపించారు. అణచివేత, ఘర్షణలు, గ్రామీణ రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్కు ఎంతో ప్రాధాన్యముంది. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంగీతం: మిక్కీ జే మేయర్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
Chiranjeevi: తొలిసారి అసెంబ్లీలో.. ఆ పరిస్థితి చూసి షాకయ్యా!: చిరంజీవి
మెగాస్టార్గా అభిమానుల హృదయాల్లో నిలిచిన చిరంజీవి, ప్రజాసేవ చేస్తూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డి ఆత్మీయంగా సమావేశమయ్యారు.
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్గా ‘మాయ-వన్’ రాబోతోంది -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నా ప్రేమ, మద్దతు పవన్కల్యాణ్కే.. అల్లు అర్జున్ పోస్ట్
పవన్ రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా పోస్ట్పెట్టారు. -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
Sai Pallavi: హ్యాపీ బర్త్డే సాయి పల్లవి.. ‘తండేల్’ టీమ్ స్పెషల్ విషెస్
ప్రముఖ సినీ నటి సాయి పల్లవి తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు ‘తండేల్’ చిత్ర బృందం బర్త్డే విషెస్ తెలిపింది.
-
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్హిట్ మూవీ ‘ఆవేశం’ మెప్పించిందా? -
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM