Allari naresh: వినోదాలకు సిద్ధం
‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ థియేటర్లలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు.
‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ థియేటర్లలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాత. ఫరియా అబ్దుల్లా కథానాయిక. వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను నెట్టింట పంచుకుంది. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కొత్తదనం నిండిన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతమందించగా.. సూర్య ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టేలా..
వినయ్, అరుణ్, దీప్తి వర్మ ప్రధాన పాత్రల్లో సూర్య తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. యు.శ్రీనివాసుల రెడ్డి, బి.నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కె.పురుషోత్తం రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సాయికుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నుంచి సోమవారం ఓ డైలాగ్ పోస్టర్ను విడుదల చేశారు. అందులో సాయికుమార్ తన ఓటు డబ్బును తానే నిర్ణయించుకున్నట్లు ఆసక్తికరంగా చూపించారు. ‘‘ఇదొక భిన్నమైన వ్యంగ్య రాజకీయ చిత్రం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకు చాలా దగ్గరగా ఉంటుంది. త్వరలోనే టీజర్, ట్రైలర్తో పాటు విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: అభిషేక్ రుఫుస్, ఛాయాగ్రహణం: నాని ఐనవెల్లి.
ఆటో డ్రైవర్ గులాబి
భిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించే హుమా ఖురేషీ .. ఇటీవలే విడుదలైన ‘మహారాణి 3’ సిరీస్తో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడామె మరో కొత్త కథతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గులాబి’. విపుల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ మహిళా ఆటో డ్రైవర్ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించింది చిత్రబృందం. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘గులాబి’ ప్రయాణం ఆరంభం. అహ్మదాబాద్లో షూటింగ్ను మొదలుపెట్టాము’’ అనే వ్యాఖ్యలతో ఇన్స్టా వేదికగా ఓ ఫొటోను పంచుకుంది హుమా ఖురేషీ. ఇందులో ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనుందామె. జ్యోతి దేశ్పాండే, విశాల్ రానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. -
బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. -
శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘థగ్లైఫ్’ గీత రచయితగా..
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. -
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..