‘డాంగ్‌.. డాంగ్‌..’ అదరగొట్టిన తమన్నా!

మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా

Updated : 05 Jan 2020 21:12 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘డాంగ్.. డాంగ్‌..’ అంటూ పాటకు తమన్నా లైవ్‌ డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్‌ చేసే అవకాశం ఇచ్చిన మహేశ్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు అనిల్‌ చాలా చక్కని వ్యక్తి అని అన్నారు. ఆయన టేకింగ్‌ బాగుంటుందని తెలిపారు. 

నాది గమ్మతైన వేషం

అంతకుముందు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సంక్రాంతికి ఎవరూ మహేశ్‌బాబుకు సరిరారని అన్నారు. నా సోదరుడు అనిల్ రావిపూడి గమ్మత్తైన వేషం ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు గార్లకు ధన్యవాదాలు’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని