ముంబయిలో విజయ్‌ దేవరకొండ.. ఎందుకంటే?

టాలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ముంబయిలో కనిపించారు. ఆయన హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఫైటర్‌’. ఈ సినిమా కోసం విజయ్‌ కాకుండా పూరీ జగన్నాథ్‌, ఛార్మి కూడా ముంబయి వెళ్లారు. లుక్‌ సెట్టింగ్‌ కోసం చిత్ర బృందం అక్కడికి చేరకున్నట్లు....

Published : 06 Jan 2020 18:35 IST

ట్వీట్‌ చేసిన ఛార్మి

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ముంబయిలో కనిపించారు. ఆయన హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఫైటర్‌’. ఈ సినిమా కోసం విజయ్‌తో పూరీ జగన్నాథ్‌, ఛార్మి కూడా ముంబయి వెళ్లారు. లుక్‌ సెట్టింగ్‌ కోసం చిత్ర బృందం అక్కడికి చేరకున్నట్లు ఛార్మి తెలిపారు. ఈ మేరకు తన ఫొటో షేర్‌ చేస్తూ.. ట్వీట్‌ చేశారు. ‘పూరీ జగన్నాథ్‌ సమక్షంలో స్టైలిస్ట్‌ అలీం హకీమ్‌ దగ్గర విజయ్‌ దేవరకొండ స్టైలింగ్‌, లుక్‌ సిద్ధమౌతుండగా.. మా డీవోపీ విష్ణుశర్మ నా ఫొటో తీశారు. మా ‘ఫైటర్‌’ న్యూ లుక్‌ అత్యద్భుతంగా వచ్చింది’ అని పోస్ట్‌ చేశారు. ప్రముఖుల్లో చాలా మంది వరకు అలీం హకీమ్‌ వద్ద హెయిర్‌ సెట్‌ చేసుకుంటుంటారు . కోహ్లీ, వరుణ్‌ ధావన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, అర్జున్‌ కపూర్‌, కల్యాణ్‌ రామ్‌ తదితరులు ఆయన వద్ద హెయిర్‌ స్టైల్‌ను సెట్‌ చేయించుకున్నారు.

‘ఫైటర్‌’ సినిమాలో కథానాయిక ఎవరో ఇంకా ప్రకటించలేదు. కానీ జాన్వీ కపూర్‌ ఈ పాత్రకు సంతకం చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై పూరీ, జాన్వి ఇంకా స్పందించలేదు. సరైన కథ వస్తే దక్షిణాదిలో నటించేందుకు జాన్వి సిద్ధంగా ఉందని ఇటీవల ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ చెప్పారు. మరోపక్క విజయ్‌తో కలిసి పనిచేయాలని ఉందని జాన్వి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని