సిధ్‌ శ్రీరామ్‌ ‘ఈ మాయ పేరేమిటో’ విన్నారా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో యువ గాయకుడు సిధ్‌ శ్రీరామ్‌ హవా నడుస్తోంది. గతేడాది ఆయన పాట పాడిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు, ఆ పాటలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు తాజాగా యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ కోసం...

Updated : 07 Dec 2022 16:41 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం టాలీవుడ్‌లో యువ గాయకుడు సిధ్‌ శ్రీరామ్‌ హవా నడుస్తోంది. గతేడాది ఆయన పాట పాడిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు, ఆ పాటలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు తాజాగా యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ కోసం ఆయన గొంతు సవరించుకున్నారు. రాజ్‌ తరుణ్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. మాళవిక, హెబ్బాపటేల్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్న తాజా చిత్రం సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘ఈ మాయ పేరేమిటో’ అంటూ సాగే గీతాన్ని ఆలపించారు. అనూప్‌ అందించిన స్వరాలకు కిట్టు విస్సప్రగడ సాహిత్యం అందించారు. గురువారం ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ గీతాన్ని విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని