కృష్ణ బర్త్‌డే.. మహేశ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తర్వాతి సినిమా ఖరారైంది. ఆయన 27వ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘గీత గోవిందం’ ఫేం పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఆదివారం మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.....

Published : 30 May 2020 18:30 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తర్వాతి సినిమా ఖరారైంది. ఆయన 27వ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘గీత గోవిందం’ ఫేం పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఆదివారం మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న ఉదయం 9.09 గంటలకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. ‘మహేశ్‌తో కలిసి మరో సినిమా కోసం పనిచేస్తున్నాం. మీరు ఈ చిత్రం గురించి ఎన్నో విన్నారు.. ఇప్పుడు అసలు నిజం తెలియడానికి సమయం దగ్గరపడింది’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి.

ఆదివారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘సర్కారి వారి పాట’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్‌ శైలి మాస్‌ అంశాలతో చిత్రం రూపొందుతోందట. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా ఇది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సినిమా హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని