రేణు దేశాయ్‌ పాత్ర మార్చేసిన పవన్‌

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘బద్రి’. రేణుదేశాయ్‌, అమీషా పటేల్‌ కథానాయికలు. ఈ

Published : 31 May 2020 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘బద్రి’. రేణుదేశాయ్‌, అమీషా పటేల్‌ కథానాయికలు. ఈ సినిమా విడుదలైన ఇటీవల 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా రేణు దేశాయ్‌తో పూరి జగన్నాథ్‌.. మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 

ఈ సినిమాలో వెన్నెలగా రేణు దేశాయ్‌.. సరయూ పాత్రలో అమీషా పటేల్‌ అలరించారు. అయితే, తొలుత సరయూ పాత్ర కోసం రేణు దేశాయ్‌ను ఎంపిక చేశారట పూరి. తీరా సెట్స్‌పైకి వెళ్లేసరికి రేణులోని కొంటెతనాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని గమనించిన పవన్‌కల్యాణ్‌.. వెన్నెల పాత్రకు ఆమె అయితే బాగుంటుందని సూచించారు. ఆ సూచన పూరి జగన్నాథ్‌కు కూడా నచ్చడంతో కథానాయికల పాత్రలు తారుమారు అయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని