‘సరిలేరు..’ పాటతో అదరగొట్టిన దేవీశ్రీ మేనల్లుడు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన అభిమానులకు ఒక మంచి గిఫ్ట్‌ ఇచ్చారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్‌ సాంగ్‌ను తన

Published : 26 Jan 2020 19:01 IST

హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన అభిమానులకు ఒక మంచి గిఫ్ట్‌ ఇచ్చారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్‌ సాంగ్‌ను తన మేనల్లుడు తనవ్‌ సత్య పాడగా, ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మొత్తం టైటిల్‌ సాంగ్‌ను మ్యూజిక్‌తో సహా ఆ చిన్నారి పాడటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా చక్కగా, ఓపికగా పాడాడంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

‘‘మా మేనల్లుడు తనవ్‌ సత్య ‘సరిలేరు నీకెవ్వరు’ యాంథమ్‌ విత్‌ బ్యాగ్రౌండ్‌తో పాడిన పాట మీకోసం. తను ఎప్పుడు నేర్చుకున్నాడో నాకూ తెలియదు. పూర్తి పాటను ఎంతో ఓపికతో పాడాడు. మీకు ఆ ఓపిక ఉంటే దయచేసి చూడండి’’ అంటూ ట్వీట్‌ చేశారు.

మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని